పరకాల, సెప్టెంబర్ 28: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంటే.. ఓర్వలేని విపక్ష నాయకులు పగటి వేషగాళ్లలాగా గ్రామాల్లోకి వచ్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రూ. 2.24 కోట్లతో మండలంలోని వెంకటాపూర్ గ్రామం నుంచి లక్ష్మీపురం వరకు, రూ. 1.80 కోట్లతో నాగారం నుంచి మల్లక్కపేట వరకు, రూ. 1.40 కోట్లతో నాగారం గ్రామం నుంచి పైడిపల్లి వరకు నూతన బీటీరోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నాగారంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి కృషితోనే రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని విపక్షాల నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించాలని కోరారు. ప్రజలను మభ్యపెట్టేందుకే సాధ్యం కాని హామీలు ఇస్తూ గ్యారెంటీల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విపక్ష నాయకులు పగటి వేషగాళ్ల మాదిరిగా ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారని, గమనించాలన్నారు. పరకాలలో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే అందరూ ఆశ్చర్చపోయేలా సీఎం కేసీఆర్ జెట్ స్పీడ్తో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టితోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నట్లు చెప్పారు. రాష్ర్టానికే తలమానికమైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పరకాల నియోజకరవ్గంలో ఉండడం మనందరి అదృష్టమన్నారు. టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభమైతే లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇందులో 90 శాతం ఉద్యోగాలు నియోజకవర్గ ప్రజలకే వచ్చేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో, నియోజకరవ్గంలో మరింత అభివృద్ధి, సంక్షేమం పెరుగాలంటే కేసీఆర్ను మరోసారి సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు విపక్ష నేతల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సిలివేరు మొగిలి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ బొల్లె భిక్షపతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు చింతిరెడ్డి సాంబరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గుండెబోయిన నాగయ్య, నల్లెల్ల లింగమూర్తి, వైస్ ఎంపీపీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బొజ్జం రమేశ్, నిప్పాని సత్యనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నడికూడ: బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గ్రామాలకూ మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రూ. 3.90 కోట్లతో వరికోల్ నుంచి హైబోత్పల్లి, వరికోల్ నుంచి చర్లపల్లి వరకు బీటీరోడ్డు పనులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఒక్క వరికోల్లోనే ప్రభుత్వం అన్ని వర్గాలకు రూ. 15.62 లక్షలను ప్రతినెలా పింఛన్ల రూపంలో అందిస్తున్నదన్నారు. కాంగ్రెస్ రూ. 4 వేల పింఛన్ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామంలోని పేదలకు అందించేందుకు 110 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని, ఎమ్మెల్సీతో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్తో మాట్లాడి మరో 300 ఇండ్లను అందజేస్తామన్నారు. పోచంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోనే వరికోల్ మౌలిక వసతుల్లో నంబర్వన్ అన్నారు. త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సాదు నిర్మలా సమ్మిరెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల స్ంథ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ కోడెపాక సుమలత, ఏఎంసీ చైర్మన్ తిప్పని హైమావతీ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గణపతిరెడ్డి, మాదారం సొసైటీ చైర్మన్ లింగమూ ర్తి, సర్పంచులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.