ఖిలావరంగల్, మార్చి 23: రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు -2.0 కార్యక్రమంలో జిల్లాలో గురువారం వరకు 2,86,512 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్ఓ కే వెంకటరమణ తెలిపారు. ఇప్పటివరకు 149 గ్రామ పంచాయతీలు, 42వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 25 పంచాయతీలు, 19 వార్డుల్లో కంటి శిబిరాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. 1,34,941 మంది పురుషులు, 1,51,256 మంది మహిళలు, 310 మంది హిజ్రాలకు కంటి పరీక్షలు చేశామని వివరించారు. 42,089 మందికి రీడింగ్ కళ్లద్దాలు, 17,838 మందికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్పై కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో కంటి పరీక్షల్లో 2,17,264 మందికి ఎలాంటి సమస్యలు లేవని డీఎంహెచ్ఓ తెలిపారు.
కాట్రపల్లిలో..
రాయపర్తి: మండలంలోని కాట్రపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ బోనగిరి ఎల్లయ్య ప్రారంభించారు. ప్రజల నేత్ర సమస్యలను పరిష్కరించాలనే సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప సర్పంచ్ కందుకూరి రేణుక, ఎంపీటీసీ సంధ్యా సోమనాథం, పంచాయతీ నాగేశ్వర్రావు, ఏఎన్ఎం బూడిద సునీత, కుక్కుడపు ప్రభాకర్, బూడిద శ్రీధర్ పాల్గొన్నారు.
ఎల్గూర్రంగంపేటలో..
సంగెం: మండలంలోని ఎల్గూర్రంగంపేటలో గురువారం కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సర్పంచ్ పోతుల ప్రభాకర్, ఎంపీటీసీ పద్మా శ్రీనివాస్ ప్రారంభించారు. పలువురికి కంటి పరీక్షల తర్వాత కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ బోనాల కొమురయ్య, జనగాం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శాబోతు శ్రీనివాస్, సాంబరాజు అజయ్, రమేశ్బాబు, వార్డు ప్రేమరాములు, రమేశ్, ఎల్లమ్మ, ఉప్పలయ్య, నాయకులు బోనాల శ్రీనివాస్ పాల్గొన్నారు.