తొర్రూరు, మే 28 : అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం, చెర్లపాలెం, గోపాలగిరి గ్రామాలు కలిపి చెర్లపాలెం గ్రామ శివారులో, కరాల, అమర్సింగ్తండా, దుబ్బాతండా, హరిపిరాల గ్రామాలు కలిపి హరిపిరాల శివారులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించగా మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు చెర్లపాలెంలో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అంబేదర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేదర్ విగ్రహాన్ని ఆవిషరించారు. గ్రా మంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలే తన బలమని.. ప్రజలే తన బలగమని.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని అన్నా రు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు నీరు పుషలంగా లభించి, వ్యవసాయం పండుగలా మారిందన్నా రు. తెలంగాణ ఏర్పాటైతే కరంటు ఉండదని, దీపాలు పెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేసిన పార్టీల నోరు మూయించే లా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ రాకముందు ఏ గ్రామానికి వెళ్లినా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు దర్శనమిచ్చేవని, ఇప్పుడు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రోహిణి కార్తె వస్తే పంట పెట్టుబడి లేక రైతు గుండె దడదడలాడేదని, ఈ విషయంపై బాగా ఆలోచించిన కేసీఆర్ పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారని అన్నా రు.
రైతు చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా రూ.5లక్షల బీమా కల్పించినట్లు తెలిపారు. కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటున్నదన్నారు. మిషన్ కాకతీయతో చెరువు, కుంటలను అపురూపంగా తీర్చిదిద్దుకున్నట్లు చెప్పా రు. 24 గంటల కరంటు ఇస్తుండడంతో ఓర్వలేని కేంద్రం ఉచిత కరంటును నిలిపివేస్తే రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు ఇస్తామని చెప్పినా వినకుండా సీఎం కేసీఆర్ తిరసరించినట్లు తెలిపారు. కేంద్రంలో మోదీ సరారు తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క టి కూడా కేటాయించలేదన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాల్గొని రాష్ర్టాన్ని సాధించుకున్నామో అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేస్తున్నదని విమర్శించారు. దేశవ్యాప్తం గా మార్పు కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వివరించారు. దేశంలో తెలంగాణ మినహా అన్ని రాష్ర్టాల్లో ఆకలి చావులు ఉన్నాయని, మోదీ ప్రధాని అయ్యాక మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఒక్కటి కూడా లేవన్నారు.
పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఒకో గ్రామంలో రూ.కోటి మేర నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తూర్పు చిన్న అంజ య్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా సమితి సభ్యుడు రామసహాయం కిశోర్రెడ్డి, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ లింగాల వెంకటనారాయణగౌడ్, మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు పాల్గొన్నారు.