తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవతరణ వేడుకల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, అధికారులతో ఆదివారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ 21 రోజులపాటు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలన్నారు. సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా ఇండ్ల ముందు మహిళలతో ముగ్గులు వేయించాలని సూచించారు. గ్రామాలు, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తెలియజేయాలని చెప్పారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రగతి నివేదికలు చదివి వినిపించాలని పేర్కొన్నారు. ఉత్సవాల్లో అన్ని వర్గాల వారు భాగస్వాములయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
హనుమకొండ, మే 28 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 21 రోజుల పాటు పండుగలా నిర్వహించాలని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ప్రజలను భాగస్వాములను చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రావతరణ జరిగి 10 ఏండ్లు కావస్తున్నందున ఉత్సవాలను మన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టేపడేలా నిర్వ హించాలన్నారు. రోజుకో కార్యక్రమం చొప్పున 21రోజుల పాటు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని అధి కారులను ఆదేశించారు. ఈ దశాబ్ది ఉత్సవాలు పల్లెపల్లెనా జరగాలని, ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని, ఆయా గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతటా గ్రామ సభలు పెట్టాలని చెప్పారు. ప్రగతి నివేదికలు చదివి ప్రజలకు వినిపించాలన్నారు. గ్రామంలో ఈ పదేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. అలాగే తెలంగాణలో సాధించిన అభివృద్ధి, విజయాలను ప్రజలకు తెలిసేలా ప్రదర్శనలు ఇవ్వాలన్నారు.
ప్రతి ఇంటి ముందు 10 ఏండ్ల విజయోత్సవాలు ఉట్టిపడేలా రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దాలని, అలా మహిళలను సిద్ధం చేయాలని చెప్పారు. ఇండ్ల ముందు ముగ్గులు, తెలంగాణ అభివృద్ధికి ప్రతీకలుగా నిలవాలన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహిళలకు, మహిళా సంఘాలకు ఎకడా లేని గుర్తింపు, గౌరవం దకిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నదని, వారికి రుణాలు అందచేస్తూ, ప్రోత్సహిస్తూ, ఫ్లిప్కార్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, మారెటింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. మహిళా సంఘాలు చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా ఆయా ఉత్పత్తులకు మంచి ఆదరణ కల్పించాలని అధికారులకు చెప్పారు.
ప్రగతి ఫలాలను ప్రజలకు వివరించాలి
ప్రగతి ఫలాలు తెలిసేలా గ్రామాల్లో, జిల్లాలో ర్యాలీలు, మానవ హారాలు నిర్వహించాలని మంత్రి అన్నారు. విద్యార్థులు, మహిళా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేయాలని చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పన, నర్సరీలు, డంపింగ్ యార్డులు, కల్లాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లెప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని వివరించారు. వీటితోపాటు అభివృద్ధిపై గ్రామాల్లో దండోరాలు వేయించి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారు. అనేక మంది త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఆవిర్భవించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల స్థూపాలు ఉన్నచోట వాటికి, లేనిచోట కొత్తగా ఏర్పాటు చేసి, అమరులకు ఘనంగా నివాళులు అర్పించాలన్నారు.
తెలంగాణకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధిపై నివేదికలు సిద్ధం చేయాలని, గతంలో పల్లెలు ఎట్లుండే… ఇప్పుడు ఎలా ఉన్నాయనే విషయాలు ప్రజలకు తెలిసేలా, ఫొటో ఎగ్జిబిషన్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అధికారులు ఆయా శాఖ ల వారీగా సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వివిధ వర్గాల వారీగా, వృత్తుల వారీగా, సమాజంలోని ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, ఆయా కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ, వివిధ అభివృద్ధి కమిటీలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.
ఏ రోజు ఏం చేయాలి? ఎలా చేయాలనే దానిపై మార్గదర్శకాలు సిద్ధం చేసి ఆయా అంశాలను గ్రామ స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులకు చేరేలా చేయాలని మంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. చీఫ్ విప్ వినయ్ భాసర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, సీపీ రంగనాథ్, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.