భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో సంస్కృతీ సంరంభం వెల్లివిరిసింది. కళాకారులు నిర్వహించిన ప్రద ర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో సందడి నెలకొంది. పటాకు లు, తారాజువ్వల వెలుగుల్లో వజ్రోత్సవాలు మెరిశాయి. హనుమకొండ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగ ణంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి పాల్గొని కళా ప్రదర్శనలను తిలకించారు. భూపాలపల్లిలోని ఇల్లందు క్లబ్ హౌస్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. మిగతా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని కళాకారుల ఆటపాటలను వీక్షించారు.
నమస్తే నెట్వర్క్ : స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కళాకారుల ప్రదర్శనలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా ఆటపాటలతో ఆకట్టుకున్నారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో జానపద కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జేఎన్ఎస్ మైదానంలో పటాకులు కాల్చారు. రంగురంగుల తారాజువ్వులు ఆకాశంలో కనువిందు చేశాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్ మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలను ఆలరించాయి.
కార్యక్రమంలో జేసీ స్వర్ణలత, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జిల్లా ఎస్పీ సురేందర్రెడ్డి, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్కృతీసంప్రదాయాలు వెల్లివిరిశాయి. కళాకారులు బతుకమ్మలు, బోనాలు ఎత్తుకొని కోలాటాలు ఆడారు. ఒగ్గు డోలు కళాకారులు ఆట-పాటలతో మంత్రముగ్ధుల్ని చేశారు. గిరిజన యువతులు, మహిళలు డప్పుచప్పుళ్ల నడుమ నృత్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి జనగామ ఆర్డీవో సీహెచ్ మధుమోహన్, అధికారులు నృత్యం చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథులు తమ మాటలు-పాటలతో సభికులను హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, డీసీపీ సీతారాంతో కలిసి పటాకులను పేల్చి తారాజువ్వలను వెలిగించారు. మహబూబాబాద్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, కలెక్టర్ కే శశాంక, ఎస్పీ శరత్చంద్రప వా ర్, అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కమిషనర్ ప్రసన్నారాణి, జడ్పీ సీఈవోపాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక, జానపద, యక్షగానం, ఒగ్గుకథ, బంజారా నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ములు గు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జానపద కళా ప్రదర్శనను కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ వైవీ గ ణేశ్ హా జరై ప్రారంభించారు.