రాయపర్తి, మే 6: రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తులన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంతోపాటు మండలంలోని పెర్కవేడు, సూర్యతండా, మొరిపిరాల, కాట్రపల్లి, తిర్మలాయపల్లి గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. సూర్యతండాలో జాంభవ రైతు ఉత్పత్తిదారుల సేవా సంఘం, రాయపర్తిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉషోదయ రైతు ఉత్పత్తిదారుల సేవా సంఘం నేతృత్వంలో ఏర్పాటు చేసిన మక్కజొన్నల కొనుగోలు కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం షైవ సంక్షోభంలోకి పోతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుబిడ్డ కావడం వల్ల రాష్ట్రంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దనే సంకల్పంతో రైతులు పండించిన అన్ని రకాల పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడా లేని విధంగా కోట్లాది రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు తిండి పెడుతున్న అన్నదాతలు ఆగం కావద్దనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాలు, పురుగు మందులను అరికట్టడం, పంటలకు సాగు జలాలను సమృద్ధిగా అందించడం, మిషన్ చెరువులను సమగ్రాభివృద్ధి, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల గ్రామీణ ప్రాంతాల్లోనే మార్కెటింగ్ సౌకర్యాల కల్పనల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా ఉందని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వానికి మండల రైతులు అండగా ఉండాలని కోరారు.
మండలంలో మక్కలు పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, గిట్టుబాటు ధరలు పొందాలని సూచించారు. అదనపు కలెక్టర్ కోట శ్రీవత్స, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్లు గారె నర్సయ్య, చిన్నాల తారాశ్రీ రాజబాబు, అయిత రాంచందర్, బిల్ల రాధిక, బండి అనూషా రాజబాబు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీడీవో తుల రామ్మోహన్, ఐకేపీ ఏపీఎం పులుసు అశోక్కుమార్, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, ఏవో గుమ్మడి వీరభధ్రం, పలు శాఖల ఏఈలు అనూష, కార్తీక్రెడ్డి, బత్తిని తరుణ్కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహ్మానాయక్, పూస మధు పాల్గొన్నారు.
మహిళల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
పాలకుర్తి నియోజకవర్గంలోని మహిళల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకుసాగుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాయపర్తి మండలం మ్యాక్స్ భవనం, మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనంలోని గోడౌన్, కాట్రపల్లిలోని రైతువేదిక భవనాల్లో సెర్ప్-స్త్రీనిధి నేతృత్వంలో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణా తరగతుల ముగింపు వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కొద్దిసేపు కుట్టుమిషన్పై బట్టలు కుడుతూ మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మహిళలకు పైలెట్ ప్రాజెక్ట్గా కుట్టుశిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సీసీలు చీపురు దేవేంద్ర, పరీదుల అనిత, పావని, వినోద, సీఏలు బమ్మెర రమాదేవి, అలివేలు మంగమ్మ, గడ్డం సంధ్యారాణి, మహ్మద్ హసీనా, పుష్ప, యాకయ్య, అనిత శ్రీలత, మయూరి, కాంచనపల్లి వనజారాణి, కుందూరు రాంచంద్రారెడ్డి, వల్లెపు వెంకటేశ్వర్లు, రెంటాల గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. కాగా, చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఏనుగు మునేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.