వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 22 : బంజారాల అభ్యున్నతికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం యాకుబ్పురలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో సేవాలాల్ 284వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ చూపిన మార్గం ఆచరణీయమని, దేశం గర్వించదగిన ఆధ్యాత్మికవేత్తలో ఆయన ఒకరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణమన్నారు. అనంతరం బంజారా సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను సన్కానించారు.
కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
కరీమాబాద్ : సమష్టిగా పని చేయడం వల్లే ఆజంజాహి మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు విజయవంతం అయ్యాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఇందుకు కృషి చేసిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులను బుధవారం క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.