సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై పలు పార్టీల నాయకులు, సంఘాల నేతలు మండిపడ్డారు. జిల్లాలో రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు మిన్నంటాయి.
నర్సంపేట/వర్ధన్నపేట/నల్లబెల్లి, మార్చి 29: నర్సంపేటలోని అంగడి సెంటర్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్ ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నదని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కేంద్రం హరిస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు లావణ్య, సుశీల, అనిత, మాట్ల సుధ, బిందు, చందన, మాధవి, సౌందర్య పాల్గొన్నారు. అలాగే, వర్ధన్నపేటలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి తాసిల్దార్, ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు. కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఆరెల్లి రవి, సీపీఐ, కార్మిక సంఘం నాయకులు యాదగిరి, సామ్యేల్, భిక్షపతి, శ్రీనివాస్, మోహన్, వేణు, ఆనందం, భాస్కర్, రవి, వెంకన్న, సుమన్, శ్రీకాంత్, సంపత్, బాబు, భుజంగం, వేణు, శ్రీనివాస్, ప్రకాశ్, రాజు, తిరుపతి పాల్గొన్నారు. నల్లబెల్లిలోని అంబేద్కర్ సెంటర్లో సమ్మె నిర్వహించారు. సీపీఎం మండల నాయకుడు కడియాల మనోహర్, ఎంసీపీఐ(యూ) మండల కార్యదర్శి దామ సాంబయ్య, ఈర్ల పైడి, బర్ల గౌరయ్య, సమ్మయ్య, రవి, అనిల్, నాగేశ్వర్రావు, రమేశ్, మొగిలి, నరేశ్, రామ్ మేస్త్రీ, కొమురయ్య పాల్గొన్నారు.
సంగెం/నెక్కొండ/మట్టెవాడ/కాశీబుగ్గ/పర్వతగిరి/వరంగల్చౌరస్తా, మార్చి 29: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా సంగెంలో కార్మికులు సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దుపాకి రాజు, ఎండీ ఇస్మాయిల్, మెట్టుపెల్లి రమేశ్, కాటికాపల రమేశ్, శోభన్బాబు, సంపత్, శ్రవణ్, రాజు, కోర్నేలు, రాంచందర్, కుమారస్వామి, నరేశ్, కుమార్ పాల్గొన్నారు. నెక్కొండలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పెద్దకాసు మల్లయ్య, తోట వెంకన్న, శ్రీమన్నారాయణ, భిక్షపతి, సదయ్య, సురేందర్, వినయ్ పాల్గొన్నారు. వరంగల్ మట్టెవాడ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు జరుపుల వీరస్వామి, హనుమకొండ జిల్లా అధ్యక్షడు ఎండీ సాజిత్ పాషా, కుడికాల సురేశ్, కే నరేందర్, ఎం నరేశ్, వీ రమేశ్, జీ భిక్షపతి, డీ రమణ, ఐలయ్య పాల్గొన్నారు.
మార్కెట్ పరిధిలోని వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే కార్మిక, కర్షకులు కేంద్రం తీరుతో ఇబ్బందులు పడుతున్నారని వివిధ సంఘాల నాయకులు అన్నారు. కార్యక్రమంలో కృష్ణ, రవికుమార్, ప్రసన్న, మహేందర్, మనోహర్, సుగుణాకర్, మోహన్, సూరయ్య, కోటి, రవి, సుమన్, ఆనందం, సుమన్, నాగరాజు, మహేశ్, రాము, గోవింద్, హఫీజ్ పాల్గొన్నారు. పర్వతగిరిలో డిప్యూటీ తాసిల్దార్ వినోద్కుమార్కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేసినట్లు ప్రజాసంఘాల నాయకులు, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత రైతు సంయుక్త సభ నాయకులు తెలిపారు. నిరసనలో ప్రజాసంఘాల నాయకులు జిల్లా రమేశ్, మాదాసి యాకూబ్, వల్లందాసు కుమార్, యూటీఎఫ్ నాయకులు బైరి తిరుపతి, పాక శ్రీనివాస్, మహంకాళి రామస్వామి, జీపీ యూనియన్ నాయకులు సావిత్రి, ఒగ్గు సుగుణమ్మ, మంజుల, ఒగ్గు యాకయ్య పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెకు టీఎన్జీవోస్ మద్దతు తెలిపింది. వరంగల్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ మాట్లాడుతూ రైతు, కార్మిక, ఉద్యోగులకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జిల్లా టీఎన్జీవోస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.