ధర్మసాగర్, జూలై 20 : టీసీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని ఎలుకుర్తి రైతువేదిక ఆవరణలో గురువారం మూడు గంటల కరెంటుపై రైతులతో కలిసి చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని మాట్లాడిన రేవంత్ రెడ్డికి, ఆయన పార్టీకి రాజకీయ సమాధి తప్పదన్నారు. విద్యుత్ మాట్లాడే నైతిక హక్కు లేదని రేవంత్కు లేదన్నారు. బేషరతుగా రేవంత్తో సహా ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి మాట్లాడాలన్నారు. గతంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు.
సీఎం కేసిఆర్ నాయకత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను చూసి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై గ్రామాల్లో చర్చల జరగాలన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణలోని 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనక్షన్లకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సమావేశంలో మండల రైతు సమన్వయ సమితి కోఅర్డినేటర్ సోంపెల్లి కరుణాకర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, మల్లక్పల్లె సర్పంచ్ మునిగెల రాజు ముదిరాజ్, వైస్ ఎంపీపీ బండారు రవీందర్, సర్పంచ్ మామిడి రవీందర్ యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రఘు, బేరే హారీశ్, రాధాకిషన్, లక్క శ్రీనివాస్, రమేశ్ రావణ్ మహారాజ్, గ్రామ శాఖల అధ్యక్షులు బేర మధుకర్, చిర్ర కుమార్, గాజుల సదానందం, జోగు మొగిలి, శేఖర్, గొట్టం రవయ్య, వక్కల కరుణాకర్, రైతులు పాల్గొన్నారు. అనంతరం నర్సింగరావుపల్లె గ్రామంలో ఇటీవల బండి బలరాం గౌడ్ మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రాజయ్య పరామర్శించారు.