వేలేరు, జూన్ 3 : దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం వేలేరు మండలంలోని సోడాషపల్లి, వేలేరు, పీచర క్లస్టర్ల రైతువేదికల్లో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రైతులు ఎడ్ల బండ్లతో ర్యాలీగా వచ్చి వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమాలకు ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ పల్లా మాట్లాడుతూ రైతు సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఎకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు.
70ఏళ్లలో ఎవరూ చేయ ని అభివృద్ధిని సీఎం కేసీఆర్ 9 ఏళ్లలోనే చేశారని కొనియాడారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత వ్యవసాయరంగంలో మార్పులను ప్రజలు గమనించాలన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో భూ గర్భ జలాలు తగ్గితే తెలంగాణలో మా త్రం పెరిగాయన్నారు. ఎండకాలంలో కూడా మన చెరువులు మత్తళ్లు పోస్తున్నాయన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ధా న్యాగారంగా అభివృద్ధి చెందిందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో, సాగు విస్తీర్ణంలో రెండో స్థానం లో నిలిచిందన్నారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు గంగిరెద్దులాంటి వారని విమర్శించారు. ఎన్నికలు రాగానే వారికి ఓట్లు గుర్తుకు వస్తాయని, అభివృద్ధి, సంక్షేమం వారికి పట్టదన్నారు.
ఈ సంక్షేమ పథకాలు మనకు మళ్లీ రావాలంటే మూడోసారి కూడా సీఎంగా కేసీఆర్నే గెలిపించుకోవాలని కో రారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ ఏవీ రంగనాథ్, ట్రైనీ ఐఏఎస్ శ్రద్ధా శుక్లా, కేయూ వీసీ డాక్టర్ రమేశ్, డీఏవో దామోదర్, ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, మండల కోఆర్డినేటర్ బిల్లా యాదగిరి, ఏవో పద్మ, తహసీల్దార్ సమ్మయ్య, సర్పంచ్ కొట్టె రాజేశ్, గోదల రాజిరెడ్డి, గాదె ధర్మారెడ్డి, ఏఈవోలు శరత్, శిల్ప, బాబు, పంచాయతీ సెక్రటరీలు వెంకటేశ్, నరేశ్, క్రాంతి, సత్యనారాయణ పాల్గొన్నారు.
ధర్మసాగర్ : రైతు సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని రాయగూ డెంలో ఏడీఏ దామోదర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు దినోత్సవంలో పల్లా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన ఎడ్ల బండిలో వచ్చి సమావేశానికి హాజరయ్యారు. దశాభ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గం లో దశాబ్ది ఉత్సవాలు పండుగలా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాకముం దు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని 55 రైతు వేదికల్లో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తునట్లు తెలిపారు. రైతు వేదికల్లో పంటలపై వచ్చే అనుమానాలను రైతులు నివృత్తిని చేసుకునేలా ఏఈవోలు, శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. సీపీ రంగనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అద్భుతమైన అభివృద్ధి జరిగిందన్నారు. ఇటీవలే పోలీసు శాఖ సర్వేలో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని తెలిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజిని, కేయూ వీసీ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ జీ రాజేశ్వర్రెడ్డి, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కరుణాకర్, జడ్పీటీసీ పిట్టల శ్రీలత, ఏవో పద్మ, సర్పంచ్లు రాజమణి, నవ్య, మునిగెల రాజు, పెసరు రమేశ్, ఎస్డీ ఇమామ్బీ, వ్యవసాయ శాస్త్రవేత్త నాగభూషణం, ఏఈవోలు ఐశ్వర్య, రజిత, రాయగూడెం క్లస్టర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
రైతు బీమాతోనే మా కుటుంబం నిలదొక్కుకుంది. నా భర్త మామిడాల సంపత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబీమా ద్వారా మాకు రూ.5లక్షలు వచ్చాయి. పిల్లల చదువు, కుటుంబ ఆర్థిక అవసరాలకు అవి ఉపయోగపడ్డాయి. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మామిడాల లక్ష్మి, క్యాతంపల్లి