తొలి తెలుగు విప్లవకవి పాల్కురికి సోమనాథుడి స్వస్థలం పాలకుర్తి.. భాగవతాన్ని తెలుగు లోగిళ్లకు పరిచయం చేసిన సహజ కవి పోతనామాత్యుడి జన్మస్థలం బమ్మెర.. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి స్వస్థలంగా భావిస్తున్న వల్మిడీ ఓరుగల్లులోనిదే.. సాహిత్య ప్రపంచంలో హిమాలయ శిఖరమంత ఖ్యాతిని గడించి, ఓరుగల్లు పేరును విశ్వవ్యాప్తం చేసిన ఆ మహాకవుల స్మృత్యర్థం రాష్ట్ర సర్కారు పలు అభివృద్ధి పనులు చేస్తున్నది. రూ.10కోట్లతో సోమనాథుడి కల్యాణ మండపం, రూ.7.50కోట్లతో పోతన స్మారక మందిరం, రూ.5కోట్లతో వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, సత్రాల నిర్మాణం పూర్తి చేయిస్తున్నది. ప్రజాకవి కాళోజీ యాదిలో ఆయన పేరిట రూ.50కోట్లతో కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నది.
రాయపర్తి, జూన్ 10 : సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సకల సౌకర్యాలను కల్పిస్తూ పట్టణాలకు దీటుగా రూపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలసి విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సుపరిపాలన వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని మహబూబ్నగర్లో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాఖడేతో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాదె హేమలతా రవీందర్రెడ్డిని కార్యాలయంలోని కుర్చిలో కూర్చోపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల రూపురేఖలను మారిపోయాయన్నారు.
గాంధీజీ కలలు కన్నట్లుగా గ్రామ స్వరాజ్య సాధనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఏనాడు లేని విధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాలను ఆధునీకరించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టినట్లు చెప్పారు. అలాగే, సర్కార్ పాఠశాలలను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. రాయపర్తి మండల సమగ్రాభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మండల ప్రజలు అండగా నిలువాలని ఆయన కోరారు. అనంతరం కార్యకర్తల మోటార్ సైకిల్పై కూర్చుని గ్రామంలోని ప్రధాన వీధుల్లో మంత్రి పర్యటిస్తూ ప్రజలతో ముచ్చటించారు. గ్రామంలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అలాగే, గ్రామం మీదుగా మండలంలోని గణేశ్కుంట తండా, పెర్కవేడు గ్రామాల వరకు వేసిన బీటీ రోడ్లు నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. గ్రామంలో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎలుకపల్లి బీరయ్య, దీకొండ కుమార్, బీరెల్లి సునీల్కుమార్ కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, నాయకులు పూస మధు, కాంచనపల్లి వనజారాణి, ఎండీ నయీం, ఎంపీటీసీ చిక్కొండ రజిత వీరస్వామి, ఉప సర్పంచ్ లక్కం సురేశ్కుమార్, లేతాకుల యాదవరెడ్డి, పెంతల సంతోష్కుమార్, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోతు కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీఎం పులుసు అశోక్కుమార్, పంచాయతీ కార్యదర్శి పవన్సాగర్ ఉన్నారు.
జర్నలిస్ట్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. మండల కేంద్రం శివారులో పది మంది సీనియర్ పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్ బోనగిరి పురుషోత్తంతో మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. సమాజ సంక్షేమం కోసం పరితపించే జర్నలిస్ట్లను సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. మండలంలోని జర్నలిస్ట్లతో తనకు ఆత్మీయ సంబంధాలున్నాయన్నారు. జర్నలిస్ట్ల కాలనీలో అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానన్నారు. కాగా, మండలంలోని కేశవాపురంలో మాజీ సర్పంచ్ జలగం మల్లయ్య కుమారుడు ప్రవీణ్కుమార్-రమ్య వివాహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, కానుకలు అందజేశారు.