తెలంగాణలోనే సర్వ మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని రా్రష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం అన్నారం షరీఫ్ దర్గాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. అధికారికంగా అన్ని పండుగలను నిర్వహించడంతో పాటు పూజారులు, ఇమామ్లకు ప్రతినెలా గౌరవ వేతనం ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని చెప్పారు. అనంతరం కల్లెడ గ్రామంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి భైరవ సమేత ఆంజనేయ స్వామి వారి దేవాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
హనుమకొండ, జూన్ 21: సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఆలయాలకు తెలంగాణ రాష్ట్రం వచ్చినంక మంచిరోజులు వచ్చాయని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. స్వరాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధి చెందడంతోపాటు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. నగరంలోని భద్రకాళీ దేవస్థానంలో చేపట్టిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను చీఫ్ విప్ దాస్యం వినయభాసర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం కింద అర్చకులకు రూ.10వేలు ఇవ్వడంతోపాటు ఆలయాల్లో రెగ్యులర్ పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వ నిధుల నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్ ద్వారా వేతనాలు ఇస్తూ వారి జీవితంలో సీఎం కేసీఆర్ వెలుగును ప్రసాదించారన్నారు. భద్రకాళీ దేవాలయ మాడవీధులకు రూ.30కోట్లు మంజూరు చేశారన్నారు. కామన్ గుడ్ ఫండ్ నుంచి రాష్ట్రంలోని వేలాది దేవాలయాల జీర్ణోద్దరణ జరిగిందన్నారు.
గతంలో తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు ఇతర రాష్ర్టాలకు వలసలు పోయేవారని, ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి వలస వస్తున్నారన్నారు. దేవాలయ దాతలు డాక్టర్ పోతాని రాజేశ్వర్ప్రసాద్, విజయ్కుమార్రెడ్డి తరఫున విష్ణువర్థన్రావు, వద్దిరాజు రవిచంద్ర తరఫున కిరణ్కుమార్ను సత్కరించారు. దేవాలయంలో ఉత్తమసేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కుండె అరుణ శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శన, వెలిదే నర్సింహామూర్తి భాగవతార్ హరికథ, గడ్డం జలంధర్ చిందుయక్షగానం, కుంట రాజు శిష్యబృందం కర్ణాటక సంగీతం, ఆచారి చిలకమారి సంజీవ రామచరితమానస్ వైశిష్టం ఉపన్యాసం, సాహితీవేత్త గిరిజా మనోహర్బాబు ధార్మికోపన్యాసం, ప్రొఫెసర్ వీ తిరుపతయ్య నాదోపాసన, ఉమ్మడి లక్ష్మణాచారి శిష్య బృందం కర్ణాటక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, దేవాదాయ ధర్మాదాయశాఖ వరంగల్ సహాయ కమిషనర్ రామల సునీత, టూరిజం అధికారి శివాజి, డీఆర్డీవో ఎ.శ్రీనివాస్కుమార్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శ్రీను, బీసీ వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, డీఆర్డీవో కార్యాలయ ఏవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా: సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు ఆధ్యాత్మిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చీఫ్ విప్ వినయ్భాసర్ అన్నారు. చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చీఫ్ విప్తోపాటు శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ రాముల సునీత, ఆలయ ఈవో కె.వెంకటయ్య ఆధ్వర్యంలో 100 మంది వేదపండితుల ఆధ్వర్యంలో మహదాశీర్వచనం నిర్వహించారు. జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా 40 మంది ధూపదీప, నైవేద్య అర్చకులకు వారు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారు.
బండా ప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,625 దేవాలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి దూప,దీప, నైవేద్య అర్చకులకు నెలకు రూ.10వేలు అందించడం గొప్ప విషయమన్నారు. ప్రాచీన దేవాలయాల అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. అర్చక జాక్ ఛైర్మన్ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 12,625 దేవాలయాలు ఉంటే 10 వేల దేవాలయాలకు ప్రభుత్వ పక్షాన గ్రాంట్ ఇన్ పెయిడ్ ఇవ్వడమేకాక ధూపదీప నైవేద్య అర్చకులకు వేతనాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు.
రుద్రేశ్వరీ, రుద్రేశ్వరస్వామి రథయాత్ర చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రారంభించారు. దేవాలయ ముందుభాగం నుంచి వందలాది మంది భజనలు కోలాటాల మధ్య రథయాత్ర కొనసాగింది. శోభాయమానంగా పురవీధుల గుండా రథయాత్ర నిర్వహించారు. కాగా, వేయిస్తంభాల గుడిలో ప్రభుత్వ సంగీత ఉపాధ్యాయురాలు వద్దిరాజ్ నివేదిత పర్యవేక్షణలో స్పెషల్ టీటీసీ విద్యార్థులు గర్భగుడిలో నిర్వహించిన హిందుస్తానీ, కర్ణాటక సంగీత గాత్ర కచేరి విశేషంగా ఆకట్టుకుంది ఈఓ వెంకటయ్య, వైష్ణవ పీఠాధిపతి ప్రసాద్ గురుజీ, అర్చక సంఘాల నాయకులు పాతర్లపాటి నరేష్, తనుగుల రత్నాకర్, లంకా శివకుమార్, రామలింగారాధ్య పాల్గొన్నారు.