నిరుపేదల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్
ఆర్థిక స్థోమతలేని వారికి అండగా ‘సీఎం సహాయనిధి’
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పథకాల అమలు
ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మహబూబాబాద్ రూరల్, జూలై 12: ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.11,65, 500 విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. పేదలకు వైద్యఖర్చులకోసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పర్కాల శ్రీనివాసరెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, మత్యం వెంకన్నగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, ఎడ్ల వేణుమాదవ్, బోడ పృథ్వీరాజ్, భూక్యా ప్రవీణ్నాయక్, పొన్నాల యుగేంధర్, బానోత్ రాము, బోడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీ కుటుంబానికి పరామర్శ
చిన్నగూడూరు: మండలంలోని జయ్యారం గ్రామంలో ఎంపీపీ వల్లూరి పద్మ అత్త, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తల్లి వల్లూరి పిచ్చమ్మ ఇటీవల మృతి చెందగా, ఎంపీ మాలోత్ కవిత బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు రాంసింగ్, మూల మురళీధర్రెడ్డి, పర్కాల శ్రీనివాసరెడ్డి, ముత్యం వెంకన్న, కేఎస్ఎన్రెడ్డి, మహబూబ్పాషా, ముత్తయ్య, చెన్నారెడ్డి, రాము, మురళి, శ్రీనివాసరెడ్డి, అమృతరెడ్డి ఉన్నారు.
చిన్నగూడూరులో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
చిన్నగూడూరు: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం కేసీఆర్ నిరుపేదల ఆశాజ్యోతిగా నిలిచారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మండలానికి చెందిన వెంకన్నకు రూ.27వేలు, రాముకు రూ.60వేలు, కవితకు రూ.20వేలు, డోర్నకల్ మండలానికి చెందిన నాగమణికి రూ.60వేలు, వెంకన్నకు రూ.40వేలు, తిరుపతమ్మకు రూ.32వేలు, హుస్సేన్బీకి రూ.37వేలు, ఉపేందర్కు రూ.60వేలు, దంతాలపల్లి మండలానికి చెందిన భిక్షమయ్యకు రూ.34వేలు, మల్లయ్యకు రూ.27వేల సీఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. మంగళవారం మండలంలోని ఉగ్గంపల్లిలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని, అనారోగ్యంతో ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదల కుటుంబాలకు సీఎం సహాయనిధి అందించి అండగా నిలిచారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఆయూబ్పాషా, లబ్ధిదారులు ఉన్నారు.