హనుమకొండ, మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద పీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించగా, అందులో ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి అవకాశం కల్పించింది. జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్, గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించింది.
అలాగే గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బెల్లయ్య నాయక్, స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా భూపాలపల్లికి చెందిన అయిత ప్రకాశ్రెడ్డి, ఎండీ రియాజ్కు గ్రంథాలయాల పరిషత్ చైర్మన్గా, ఇనుగాల వెంకట్రాంరెడ్డికి కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్గా, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది.