హనుమకొండ చౌరస్తా : సామాజిక సంస్కరణవాది జ్యోతిరావు ఫూలే (Jyotirao Phule) అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి ( VC Pratap reddy ) అన్నారు. కేయూ దూరవిద్య కేంద్ర ప్రాంగణంలోని పూలే విగ్రహాల వద్ద మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రంతో కలిసి పూలే విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు.
వీసీ మాట్లాడుతూ సమాజంలో ఉన్న రుగ్మతలు రూపుమాపడానికి విద్యనే ఏకైక సాధనమని నమ్మి, నిమ్నవర్గాలకు ముఖ్యంగా మహిళలకు విద్యను అందించడం వల్ల సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. రిజిస్టార్ రామచంద్రం మాట్లాడుతూ పూలే ఆశయాలను కొనసాగించాలని తెలిపారు.
ఓఎస్డీ వెంకటరామిరెడ్డి, పాలకమండలి సభ్యులు బి.సురేష్లాల్, బి.రమ, అనితారెడ్డి, చిర రాజు, క్యాంపస్ ప్రిన్సిపాల్ మనోహర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, హాస్టల్ సంచాలకులు శ్రీనివాస్, విభాగాధిపతులు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ సుంకరి జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.