గిర్మాజీపేట, ఫిబ్రవరి 22: అంధత్వ నివారణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. కంటిపరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న వారితో శిబిరాలు కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,685 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి. వారిలో 27,669 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేయగా, 16,839 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. మంగళవారం వరకు 1,905 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అందజేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ కాజీపేట వెంకటరమణ తెలిపారు.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంలో శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి మంగళవారం వరకు 1,54,685 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అందులో 27,669 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేశామని, 16,839 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇవ్వగా, మంగళవారం వరకు 1,905 మందికి ప్రిస్క్రిప్షన్గ్లాసులు అందజేసినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 65 గ్రామపంచాయతీలు, 15 వార్డుల్లో కంటివెలుగు పరీక్షలు పూర్తయ్యాయని, 25 గ్రామ పంచాయతీలు, 19వార్డుల్లో త్వరలోనే కంటిపరీక్షలు పూర్తవుతాయని డీఎంహెచ్వో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 72,403 పురుషులు, 82,256 మంది స్త్రీలు, 22మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారన్నారు. 24,662 ఎస్సీలు, 14,945ఎస్టీలు, 1,03,825 బీసీలు, 6,892 ఓసీలు, 4,403 మైనార్టీలు, 40 ఏళ్లలోపు ఉన్న 3,657మంది, 40 ఏళ్లు పైబడిన 24,012 మందికి కంటిపరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 1,10,177 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని వివరించారు.
ఉత్సాహంగా..
నర్సంపేట రూరల్: మండలంలోని ముగ్ధుంపురం, నాగుర్లపల్లి గ్రామాల్లో మంగళవారం కంటి వెలుగు శిబిరాలు కొనసాగాయి. ఆయా గ్రామాల ప్రజలు కంటి వెలుగు శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. శిబిరాలకు వచ్చిన ప్రజలను సిబ్బంది పరీక్షించి మందులు పంపిణీ చేశారు. పలువురికి కళ్లద్దాలను అందించారు. ఈ శిబిరాలను సర్పంచ్లు పెండ్యాల జ్యోతి, కందికొండ రజిత, వైద్యాధికారులు బానాల అరుణ్చంద్ర, కల్యాణి పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఈవో సంజీవరావు, హెల్త్అసిస్టెంట్ సంజయ్కుమార్, లక్ష్మణ్, మాధవరావు, మల్లారెడ్డి, అనిత, స్రవంతి, ఏఎన్ఎంలు, ఆశాలు ఉన్నారు.
దూపతండాలో..
పర్వతగిరి: మండలంలోని దూపతండా గ్రామంలో మంగళవారం కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కమల పంతులు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని, ప్రతిఒక్కరూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ధరంసోతు జామ్రీ, ఉపసర్పంచ్ రాములు, అభివృద్ధి కమిటీ నాయకులు ధరంసోతు ధూల్యనాయక్, కార్యదర్శి సురేశ్, వైద్య బృందం రమేశ్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.