ఆత్మకూరు, జనవరి 4 : పేదల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం పెంచికలపేట గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులను ఎమ్మెల్యే కలెక్టర్ సిక్తా పట్నాయక్తో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యమన్నారు. సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 48గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం లిమిట్ను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. గ్రామాల్లో కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం దరఖాస్తులు స్వీకరించడం100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి రామిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రాజేందర్, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ కోరె లలిత పాల్గొన్నారు.
దామెర : దుర్గంపేటలోని అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి దరఖాస్తులను పరిశీలించారు. కాగా, ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గండు రామకృష్ణ గృహలక్ష్మి, దళితబంధు పథకాలను కొనసాగించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారి రాంరెడ్డి, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఏపీవో శారద, సర్పంచ్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పరకాల : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. పట్టణంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన 21,22వ వార్డుల ప్రజాపాలన సభలో పాల్గొన్నారు.