పాలకుర్తి రూరల్, ఆగస్టు 22: మహాకవులు నడయాడిన పాలకుర్తి ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమని, వాల్మీకి మహర్షి పుట్టినిల్లయిన వల్మిడికి వచ్చే నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ రానున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. వల్మిడిలోని గుట్టపై సీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభోత్సవంతోపాటు ఉత్సవ విగ్రహాల ప్రతిష్ఠాపన ఉంటాయని తెలిపారు. పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు, పర్యాటక పనుల పురోగతిపై కలెక్టర్ శివలింగయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆలయ ఆవరణలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోపాటు త్రిదండి చినజీయర్స్వామి చేతులమీదుగా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మంత్రులు తన్నీర్ హరీశ్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిరాథోడ్, వీ.శ్రీనివాస్గౌడ్ అతిథులుగా హాజరవుతారని చెప్పారు. వల్మిడి ఆలయ ప్రారంభోత్సవాన్ని కనులపండువగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. పాలకుర్తి ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు ఎంతో అభిమానమని, బమ్మెర పోతనమాత్యుడు అంటే ఎంతో ఇష్టమైన కవి అన్నారు. పాల్కురికి సోమనాథుడు పుట్టినగడ్డ పాలకుర్తి అన్నారు, వాల్మికి మహాముని పుట్టిన గడ్డ, లవకుశులు నడయాడిన నేల వల్మిడికి సీఎం కేసీఆర్ రావడం ఆనందంగా ఉందన్నారు. వల్మిడి ఆలయ పర్యాటక పనులను రూ.50కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. వల్మిడిని మరో భద్రాద్రిగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. దక్షిణ అయోధ్యగా వల్మిడి ప్రసిద్ధి చెందుతుందన్నారు.
వల్మిడి ఆలయ ప్రతిష్ఠాపనకు పాలకుర్తి నియోజక వర్గం నుంచి 30వేల మంది తరలిరావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. భక్తులకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రతిష్ఠాపన ఏర్పాట్లలో అధికారులు, ప్రజా ప్రతి నిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యువత, మహిళలు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమ విజయవంతానికి మండలాల వారీగా సమన్వయ కమిటీలు వేసుకోవాలని సూచించారు.
ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమ ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఆరు మండలాలకు మండలానికొకటి చొప్పున ఆరు ప్రచారరథాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆడియో, వీడియో సదుపాయం కల్పించాలని సూచించారు. గ్రామాల్లోని మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రచారం నిర్వహించాలన్నారు. ఇంటింటికీ తిరుగుతూ బొట్టుపెట్టి ఆలయ ప్రతిష్టాపనకు తరలిరావాలన్నారు. ఉత్సవాల్లో నాలుగు రోజులపాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. హనుమకొండ, జనగామ, తిరుమలగిరి, తొర్రూరు నుంచి ప్రత్యేక బస్సులు వేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్పై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, సినీ నేపథ్య గాయకులు, సినీ నటులు, సంగీత నృత్య కళాకారులు శివ తాండవం, భరతనాట్యం, జానపద నృత్యాలు ఉంటాయని వివరించారు. వచ్చే భక్తులకు ఇంటింటికీ పసుపు, కుంకుమ, ప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాగులో గాజులు, లడ్డూలు, పులిహోర, తీర్థప్రసాదాలను పంపిణీ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేవాలయ ప్రతిష్టాపనను అధికారులు బాధ్యత, అంకిత భావంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.
ఎర్రబెల్లి చారిటటుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేరు ఆలయ ప్రతిష్టాపన పనులతో చిరస్థాయిలో ఉండాలన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి బాధ్యతలు అప్పగిప్పారు. కాగా, మంత్రి మైనార్టీలకు షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డీపీఓ రంగాచారి, డీసీపీ పి.సీతారాం, డీఆర్డీఓ గూడూరు రాంరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏ.నాగేందర్రావు, జీవన్కుమార్, పీఆర్ ఈఈ చంద్రశేఖర్రెడ్డి, డీఈ చారి, ఏఈ శ్రీనివాస్, ఏసీపీ సురేశ్, ఆర్డీఓ వాసం రామ్మూర్తి యాదవ్, కాంట్రాక్టర్లు నర్సింహారెడ్డి, తిరుమల్రెడ్డి, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, పల్లా సుందర్రామిరెడ్డి, బస్వ మల్లేశం, చింత రవి, కేలోత్ సత్తమ్మ, దారవత్ జ్యోతి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ. మదార్, సర్పంచ్లు వీరమనేని యాకాంతారావు, కత్తి సైదులు, ఆలయ కమిటీ చైర్మన్ వీ రాంచంద్రయ్యశర్మ, ఈవో బీ లక్ష్మీప్రసన్న, డీవీఆర్ శర్మ, టూరిజం అధికారి గోపాల్రావు, ఎస్ఈ టీ వేణుమాధవ్, కేఆర్ లత, వీరమల్ల రాజు, ఈదూరు ఐలయ్య, ముత్తినేని శ్రీనివాస్, వీరారెడ్డి వృకోధర్రెడ్డి, అర్జున్, కేతిరెడ్డి నర్సింహారెడ్డి, వీరమల్ల జైహింద్, జర్పుల బాలునాయక్ పాల్గొన్నారు.