హసన్పర్తి, మే 17 : టీజీ ఎప్సెట్ ఫలితాల్లో శివాని విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. బీ స్వాతి 150, చరణ్య 2,426, సౌందర్య 3,649, నవ్య 4,435, రత్య 4,838, పూజిత 5,744, యశ్వంత్ 6,475, శ్రీశాంత్ వర్మ 6,863, ఐశ్వర్య 7,166, కృష్ణజ 7,840, అంజనాశ్రీ 8,548, జశ్వంత్ 9,018, సాయి కార్తికేయ 9,114,అన్వేశ్ 10,318, సహస్రశ్రీ 10,997 ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ టీ స్వామి తెలిపారు.
కొన్నేళ్లుగా కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా శివాని జూనియర్ కళాశాల విద్యార్థులు ఎప్సెట్లో మంచి ఫలితాలు సాధించి మరోసారి చరిత్ర తిరగరాసినట్లు తెలిపారు. ఈ మేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామితో పాటు ప్రిన్సిపాళ్లు జీ సురేందర్, వీ చంద్రమోహన్, డైరెక్టర్లు టీ రాజు, ఎన్ రమేశ్, ఏ మురళీధర్, వీ సురేశ్, ఎస్ సంతోష్రెడ్డి అభినందించారు.