వరంగల్, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇప్పటికే విద్యా కేంద్రంగా ఉన్న వరంగల్ మహానగరం, పారిశ్రామికంగానూ ముఖ్యంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హైదరాబాద్కు అనుబంధంగా వరంగల్లో ఈ రంగాన్ని విస్త రించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నది. తెలం గాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది.
హైదరాబాద్కు దగ్గర్లో ఉండడం… రైలు, జాతీయ రహదారి వంటి మెరుగైన రవాణా సౌకర్యాలు వరంగల్ నగరానికి అను కూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్-హైదరాబాద్ దారిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేంగా ఐటీ హబ్ను ఏర్పాటు చేసింది. బెంగళూరుకు తోడుగా మైసూరు అభివృద్ధి చెందినట్లుగానే.. హైదరాబాద్కు తోడుగా వరంగల్ను ప్రభుత్వం ఐటీ పరంగా అభివృద్ధి చేస్తున్నది. మైండ్ ట్రీ, జెన్ ప్యాక్ట్, టెక్ మహీంద్రా, సయంట్, క్వాడ్రంట్ వంటి కంపెనీలు ఇప్పటికే వరంగల్లో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. సాఫ్ట్పాత్ కంపెనీ విస్తర ణలో భాగంగా వరంగల్లో కార్యకలాపాలను పెంచింది. జెన్ ప్యాక్ట్, హెచ్ ఆర్హెచ్ నెక్ట్స్, హెక్సాడ్, ఎల్అండ్టీ-మైండ్ ట్రీ వంటి కొత్త ఐటీ కంపెనీ ల్లో రెండు వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి.
ఈ నాలుగు కంపెనీల కేంద్రా లను వరంగల్లో మంత్రి కేటీఆర్ గత నెలలో ప్రారంభించారు. జెన్ప్యాక్ట్ వరంగల్ బ్రాంచ్లో ఇప్పటికే 400 మంది ఉద్యోగులున్నారు. మరో 600 మందికి అవకాశం రానుందని ఆ కంపెనీ తెలిపింది. ఎల్అండ్టీ-మైండ్ ట్రీలో 500 మంది ఉద్యోగులున్నారు. మరో 500 మందిని తీసుకోను న్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. హెచ్ఆర్హెచ్ నెక్స్లో ప్రస్తుతం 120 మంది ఉన్నారు. మరో 500 మందికి అవకాశం కల్పించనున్నట్లు ఈ కంపెనీ గత నెలలో ప్రకటించింది. వరంగల్ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనున్నది. వరంగల్ ఎన్ఐటీతోపాటు మరో రెండు ప్రైవేట్ కాలేజీల్లోనూ ఇంక్యుబేషన్లు మొదలయ్యాయి. ఐటీ కంపెనీలకు అవసరమై న మానవ వనరులను సమకూర్చడంలో ఇవి దోహపడనున్నాయి.
ఉపాధి కేంద్రం..
వరంగల్ నగర శివారులో వరుసగా ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలు, మడికొండలోని టెక్స్టైల్ పార్కు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు ఇతర ఉత్పత్తి కంపెనీలకు అనుగుణంగా ఇక్కడి కేంద్రంలో కోర్సులు నిర్వహించేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ప్రణా ళిక సిద్ధం చేసింది. పలు కంపెనీల ఏర్పాటు, టెక్స్టైల్ పార్కులతో వరంగల్ వేలాది మందికి ఉపాధి కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. టాస్క్ ద్వారా ఇక్కడి యువతలో నైపుణ్యాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేప ట్టింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే లక్షల మందికి శిక్షణ ఇస్తున్న టాస్క్, వరంగల్ నగరంలోనూ యువతకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నది.