నర్సంపేట, ఫిబ్రవరి 19 : సంత్ సేవాలాల్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో సేవాలాల్ 284వ జయంతి భోగ్ భండారో కార్యక్రమంలో మాట్లాడుతూ.. గిరిజన లంబాడాలను ఏకం చేసి జీవన విధానాన్ని బోధించిన ఆధ్యాత్మిక గురువుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. లంబాడాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. తండాలకు జీపీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు.
గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నర్సంపేట నియోజకవర్గంలో గిరిజన సైనిక్ స్కూల్, డిగ్రీ కళాశాల, బాలికలు, బాలుర ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను మంజూరు చేయించామని పేర్కొన్నారు. సాగు, తాగు నీరు, బీటీ, సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన పండుగలకు ప్రాముఖ్యం ఇస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, సంగ్లాల్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, తహసీల్దార్ రామ్మూర్తి, ఎంపీపీలు వేములపల్లి ప్రకాశ్రావు, విజేందర్, డాక్టర్ ఉదయ్సింగ్, వాసునాయక్, జేత్రాం నాయక్, ఆంగోత్ భద్రయ్యనాయక్, సుభాశ్, కల్యాణ్, గంగయ్య, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.