వరంగల్, జనవరి 27 : చిత్తు కాగితాల సేకరణ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన ఆలేటి మైసమ్మ అలియాస్ కడమంచి మైసమ్మ, ఊర దివ్య, నూనె రామక్క, నూనె ఎల్లయ్య అలియాస్ గజి ఎల్లయ్యను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్ ఏసీపీ గిరికుమార్ వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురు దగ్గరి బందువులని తెలిపారు. వీరు చిత్తు కాగితాలు, ఇనుప సామాగ్రి సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. కొద్దిరోజుల కిత్రం వరంగల్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్లోని ప్రముఖ కంపెనీకి చెందిన వర్క్షాప్ కంపౌండ్లో పడిఉన్న జనరేటర్ రేడియేటర్ను చోరీ చేసి విక్రయించారు. వీరు తమ ప్రాంతానికి చెందిన మరో నిందితుడు ఆటో డ్రైవర్ సహకారంతో ఈ నెల 13న తెల్లవారుజామున జనరేటర్ రేడియేటర్ను దొంగిలించాడు.
అనంతరం రేడియేటర్ను వరంగల్లోని నాయుడు పెట్రోల్ పంప్ వెనుక చెట్ల పొదల్లో రహస్యంగా భద్రపరిచాడు. రేడియేటర్ చోరీపై కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులను గుర్తించిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం రేడియేటర్ను విక్రయించేందుకు నలుగురు నిందితులు ఆటోనగర్కు వస్తున్నట్లు తెలియడంతో కపోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ గిరికుమార్ వెల్లడించారు. నిందితులు ఆలేటి మైసమ్మ ఆత్మకూరు, మట్టెవాడ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడిందన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభచూపిన క్రైమ్ అండ్ అపరేషన్ ఆదనపు డీసీపీ పుష్ప, సీపీఎస్ క్రైం, వరంగల్ ఏసీపీలు డేవిడ్రాజ్, గిరికుమార్, మట్వాడా సీఐ రమేశ్, సీసీఎస్ మట్వాడా ఎస్సైలు యాదగిరి శంకర్నాయక్, ఏఎసై వేణుగోపాల్, కానిస్టేబుళ్లు నజీరుద్దీన్తో పాటు మట్వాడా పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ రంగనాథ్ అభినందించారు.