‘దళితులు జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బాటలు వేస్తున్నది. నిరుపేద కుటుంబాలను గుర్తిస్తూ దళితబంధు పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నది.’ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నల్లబెల్లిలో రామతీర్థం గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 20 లక్షల వ్యయంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో నియోజకవర్గంలోని 1500 మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎస్కేఎస్ సర్వేలో నమోదైన ప్రతి కుటుంబానికి పథకం వర్తింపజేస్తామని తెలిపారు. దశలవారీగా అందరికీ దళితబంధు అందిస్తామని చెప్పారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద 110 కుటుంబాలకు పాడి గేదెలనూ పంపిణీ చేశామన్నారు.
నల్లబెల్లి, డిసెంబర్ 4 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 20 లక్షల వ్యయంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను నల్లబెల్లిలో పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశమే గర్వించేలా తెలంగాణలో దళితబంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకుసీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో త్వరలో రూ.150 కోట్లతో 1500 మందికి దళిత బంధు యూనిట్లు పంపిణీ చేయనున్నామన్నారు.
ఎస్కేఎస్ సర్వేలో గుర్తించబడిన ప్రతి దళిత కుటుంబం, కొత్తగా వివాహమైన వారు ఈ పథకానికి అర్హులేనని జీవోలో స్పష్టంగా ఉందని, ఏ ఒక్కరూ అధైర్య పడొద్దన్నారు. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టు కింద 60 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంకు గ్యారంటీతో మండలంలోని 110 కుటుంబాలకు 4 పాడి గేదెల చొప్పున పంపిణీ చేసినట్లు చెప్పారు. త్వరలో మరో 110 దళిత కుటుంబాలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల ను పునరుద్ధరిస్తామని, నిధులు కూడా మంజూరయ్యాయ ని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీపీ ఊడుగుల సునీత, ఎంపీడీవో విజయ్కుమార్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, నాయకులు కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, పాలెపు రాజేశ్వర్రావు, సర్పంచ్లు కలకోటి కిరణ్, సిద్దూరి రత్నాకర్రావు, ఎంపీటీసీ జన్ను జయరావు, మాజీ మండలాధ్యక్షుడు తేజావత్ సమ్మయ్యనాయక్ పాల్గొన్నారు.
హార్వెస్టర్ను చూడ్డమే.. కొంటామనుకోలే..
– దళితబంధు లబ్ధిదారు విష్ణుప్రియ, రామతీర్థం
హార్వెస్టర్ను అప్పుడప్పుడు చూడ్డమే కానీ.. ఏనాడు కొంటామనుకోలే. హార్వెస్టర్ వరి కోస్తుంటే పొలంలో కూలీగా పని చేసేదాన్ని. సీఎం కేసీఆర్ పెద్దమనసుతో ప్రారంభించిన దళిత బంధు పథకం ద్వారా హార్వెస్టరే మా ఇంటికి రావడం ఆనందంగా ఉంది.
ట్రాక్టర్ ఓనర్ అవుతాననుకోలే..
– దళితబంధు లబ్ధిదారుడు కామెర రమేశ్
కలలో సైతం ట్రాక్టర్ ఓనర్ అవుతాననుకోలే. సీఎం కేసీఆర్ దయతో ఇన్నాళ్లకు దళిత కుటుంబాలకు గౌరవం ద క్కింది. ప్రభుత్వ ఆశయానికనుగుణంగా దళితబంధు యూ నిట్ను ఉపయోగించుకుంటాం. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ట్రాక్టర్ తాళాలు ఇవ్వగానే నా భార్య, నా కళ్లు చెమ్మగిల్లాయి.
ఈ రుణం ఎలా తీర్చుకునేది..
– దళితబంధు లబ్ధిదారుడు దామెర రాజేశ్
సీఎం కేసీఆర్ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. ఇన్నాళ్లు మా ఓట్లు దండుకున్నారే తప్ప మా బతుకుల గురించి ఆలోచించిన నాయకుడు లేడు. దళిత బంధు పథకం తీసుకువచ్చి కేసీఆర్ సారూ.. మాకు బంధవయ్యారు. పథకాన్ని ఉపయోగించుకుని వృద్ధిలోకి వస్తాం. కేసీఆర్కు ఎల్లప్పుడు అండగా ఉంటాం.