మహదేవపూర్, మార్చి 29 : వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 26న ‘నమస్తే తెలంగాణ’లో ‘వన్యప్రాణుల దాహం తీరేదేలా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. మహదేవపూర్ అటవీ ప్రాంతంలో పనిచేయని సోలార్ బోర్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి గుంటోనికుంటలో నీరు నింపారు.
వాటర్ ట్యాంకర్ సాయంతో సాసర్ పిట్స్, వాటర్ హోల్స్లో నీటిని నింపి అందుబాటులోకి తీసుకొచ్చారు. నీటి కుంటలు, సాసర్ పిట్స్లో ఎప్పటికప్పుడు నీరు నింపాలని సిబ్బందిని ఆదేశించినట్లు మండల అటవీ క్షేత్ర అధికారి కమల తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.