జనగామ చౌరస్తా, ఆగస్టు 18 : బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ చరిత్రను ప్రతి ఒక్కరూ స్మ రించుకొని, గౌరవించాలని ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తూనే శ్రమ దోపిడిని అడ్డుకున్నారని గుర్తు చేశారు.
రాచరిక పాలనకు వ్యతిరేకంగా, కులమతాలకు అతీతంగా పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే హరితహారంలో గీతకార్మికులకు ఉపాధి కల్పించేలా గిరకతాటి చెట్లను నాటి పెంచుతున్నట్లు చెప్పారు. ట్యాంక్బండ్పై పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న పోరాట పటిమ, చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిసేలా ‘మ్యూజియం’ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా పేరు చెబితేనే సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గుర్తుకు వస్తాడన్నారు. కల్లుగీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ భిన్న సంస్కృతీసంప్రదాయాలకు నెలవు జనగామ జిల్లా అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈ వో విజయలక్ష్మి, డీఆర్డీఏ రాంరెడ్డి, ఆర్డీవో మధుమోహన్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, గౌడ సంఘం జిల్లా నాయకులు మేకపోతుల ఆంజనేయులుగౌడ్, బూడిద గోపిగౌడ్, యాదగిరిగౌడ్, మూల వెంకటేశంగౌడ్, ఉప్పల య్య, రమేశ్, నాగన్న, వెంకటమల్లయ్య, శ్రీను పాల్గొన్నారు.
పాపన్న ఆశయ సాధనకు పాటుపడాలి
రఘునాథపల్లి : బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మె ల్సీ కడియం శ్రీహరి, ఎమ్మె ల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మండలంలోని కోమాల్ల, రఘునాథపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఖిలాషాపురంలోని పాపన్న కోటలో నిర్వహించిన ఉత్సవాలకు వారు హాజరయ్యారు. ముందుగా గ్రామ బస్టాండ్లో ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్య వాద కాంక్షను అడ్డుకున్న బహుజన వీరుడు పాప న్న అని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ ముప్పిడి శ్రీధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్యాదవ్, ప్రధాన కార్యదర్శి ముసిపట్ల విజయ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మారుజోడు రాంబాబు, మాజీ వైస్ ఎంపీ పీ మల్కపురం లక్ష్మయ్య, ఎంపీటీసీ అల్లిబిల్లి కృష్ణ, వై.కుమార్గౌడ్, బండి యాదగిరిగౌడ్, పీ మల్లికార్జున్, పీ రాజు, మంద రమేశ్, శాగ కైలాసం, నాయకులు జిట్టె వీరస్వామి, నామాల బుచ్చయ్య, కావటి రాజయ్య, మడ్లపల్లి సునీత, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.