హనుమకొండ చౌరస్తా, మార్చి 6 : శివరాత్రి పండుగను పురస్కరించుకుని హనుమకొండ నుంచి రామప్పకు ప్రత్యేక బస్సులు ప్రతి అరగంటకు నడుపుతున్నట్లు వరంగల్-2 డిపో మేనేజర్ తెలిపారు.
హనుమకొండ నుంచి రామప్పకు ఎక్స్ప్రెస్(పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60) పల్లెవెలుగు(రూ.80, రూ.40) ములుగు నుంచి రామప్పకు ఎక్స్ప్రెస్(రూ.40, రూ.30) పల్లెవెలుగు(రూ.30, రూ.20) ఉంటుందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.