హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 9 : సహారా సంస్థను నమ్మి ఖాతాదారులు మోసపోవొద్దని ఆ సంస్థ చీఫ్ ఫీల్డ్ మేనేజర్ పూజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో హనుమకొండ జిల్లా సహారా బాధితుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇది ఒక ప్రభుత్వ ఆమోదిత సంస్థ అని నమ్మి 13 లక్షల మంది ఇందులో ఉపాధి పొందుతున్నారని, 12 సంవత్సరాల నుంచి సహారా అండ్ సెబీ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది.
అప్పటి నుంచి ఖాతాదారులకు చెల్లించాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. హనుమకొండ పోలీస్స్టేషన్లో సంస్థ మోసాలను ఎండగడుతూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎం వేణుగోపాల్, జీ రమేశ్, వల్స సారంగం, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.