గీసుగొండ, ఫిబ్రవరి 1 : ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ-మన బడి’లో భాగంగా రూ. 22.25 లక్షలతో వాటర్ సప్లయ్, కాంపౌండ్ వాల్, తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, వంట గది, విద్యుత్ సౌకర్యం, గ్రీనరీ, డ్యూయల్ డెస్క బెంచ్ల ఏర్పాటు, పెయింటింగ్ పనులను పూర్తి చేశారు. బుధవారం ఎమ్మెల్యే చల్లా, అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స కోటతో కలిసి పాఠశలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో మండలంలో అనేక పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉండేవని, వాటిని కూల్చివేసి నూతన భవనాలను నిర్మించుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలకు పూర్వవైభవం తేవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన బస్తీ మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. సర్కారు స్కూళ్లల్లో క్యాలిఫైడ్ టీచర్లు ఉంటారని, తల్లిదండ్రులు దీన్ని గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని, అవసరమైన నిధులు కేటాయిస్తానని చెప్పారు. పాఠశాలలో గ్రీనరీ పెంచాలని సూచించారు.
రాష్ట్రం ప్రభుత్వం ‘మనబస్తీ-మన బడి’ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స కోట అన్నారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో వాసంతి, కార్పొరేటర్ ఆకుపల్లి మనోహర్, 16, 17వ డివిజన్ల కార్పొరేటర్లు సుంకరి మనీషా, గద్దెబాబు, గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, డీడబ్ల్యూవో శారద, హెచ్ఎం స్వరూప, ప్రత్యేక అధికారి మురళీధర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, ఈఈ శంకరయ్య, డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ సుధాకర్, ఏంఈవో సత్యనారాయణ, నోడల్ అధికారి రజాక్, ఎస్ఎంసీ చైర్మన్ దండు అశోక్, మాజీ చైర్మన్ మద్యాల నర్సింగరావు, రైతు బంధు సమితి కన్వీనర్ రాజు పాల్గొన్నారు.