పరకాల, ఆగస్టు 10: ఉమ్మడి పాలకుల హయాంలో నిర్విర్యమైన కులవృత్తులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో పునర్వైభవాన్ని పొందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలకు చెందిన 300 మంది చేతివృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.లక్ష విలువ చేసే గ్రాంట్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు నుంచే సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ఒక ఆలోచనతో ఉన్నారన్నా రు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి సీఎం అయ్యాక తన ఆలోచనలకు రూపం ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని సమపాళ్లతో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
ఉద్యమకారుడిగా ప్రజల కష్టాన్ని దగ్గరగా చుసిన కేసీఆర్ వారి కష్టాలను తొలగించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారని నమ్మిన సీఎం కేసీఆర్ వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనేలా తీర్చిదిద్దారన్నారు. దీంతో పట్టణాలకు వలసలు వెళ్లినవారు తిరిగివచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. గొల్ల, కురుమలకు సబ్సిడీ గొర్రెలు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, నేతన్నలకు చేయూత అందించడంతో పాటు ప్రస్తుతం చేతి వృత్తులను నమ్ముకుని జీవించే 15 కులాల వారికి రూ.లక్ష గ్రాంట్ను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు.
ప్రభుత్వ సహాయంతో కుల వృత్తిదారులకు ఆర్థిక భరోసా కలిగిందన్నారు. కాగా, దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి విడులత వారీగా రూ.లక్ష గ్రాంట్ అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, పాలన చేతకాని విపక్షాలు సీఎం కేసీఆర్ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. విపక్షాలు ముందుగా వారు పాలించే రాష్ర్టాల్లో ప్రజలకు ఎం చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజలు విపక్షాల మాటలు నమ్మితే మోసపోయినట్లే అవుతుందని, మరిన్ని సంక్షేమ పథకాలు రావాలంటే సీఎం కేసీఆర్ పరో పది కాలాల పాటు సీఎంగా ఉండాలన్నారు.
ఆ దిశగా ప్రజలు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, పరకాల, నడికూడ, సంగెం, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు మొగిలి, మచ్చ అనసూర్య, కోడెపాక సుమలత, కందగట్ల కళావతీ నరహరి, గూడ సుదర్శన్రెడ్డి, మార్క సుమలత, కక్కెర్ల రాధికా రాజు, కాగితాల శంకర్, గరిగె కల్పనా కృష్ణమూర్తి, పోలీసు ధర్మారావు, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కనుమరుగు కానున్న విపక్షాలు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న విపక్ష నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారని, రానున్న రోజుల్లో నియోజకర్గ వ్యాప్తంగా విపక్షాలు కనుమరుగు కానున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. దామెర మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మె ల్యే చల్లా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. శ్రేణులే పార్టీకి వెన్నెముక అన్నారు. వారిని కంటికి రెప్పలా చూసుకుంటానని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో గడల ఐలోని, గడల ఐలుమల్లు, రాజు, సాంబరాజు,. నానబోయిన ప్రమోద్, దాసి ప్రవీణ్, తీగుళ్ల రాజు, తేజ, పవన్, అక్కిడి దేవేందర్ రెడ్డి, చొల్లేటి రాజిరెడ్డి, గాలి రమేశ్, కోట రవి, నాగరాజు, నవీన్, అఖిలేశ్, బోళ్ల రవి, గంకిడి సాంబరెడ్డి, గిలి కిట్టు, బండి రాజు, అనిల్, శివకోటి ఉన్నారు.
కేసీఆర్కు రుణపడి ఉంటాం
చేతి వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించిన సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బీసీ కులాలకు అండగా నిలబడలేదు. గతంలో ఇచ్చిన రుణాల్లో 20 నుంచి 30 శాతం వరకే సబ్సిడీ ఇచ్చేవారు. ఆ రుణాలు పొందాలన్నా కూడా ఎంతో ఇబ్బందులు పడేవాళ్లం. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో కుల వృత్తులకు ఆదరణ పెరిగింది. సీఎం కేసీఆర్ అందరికీ సహకారం అందిస్తూ పాలిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు, రూపాయి ఖర్చు లేకుండానే కేసీఆర్ అందించిన రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ ఆర్థిక సాయంతో ఇస్త్రీపెట్టె కొనుక్కోవడంతో పాటు చిన్న డబ్బా పెట్టుకుంటా.
– వైనాలా సురేశ్, కల్యాణి దంపతులు, పరకాల