ఖిలావరంగల్, ఏప్రిల్ 2: కేసీఆర్ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్న వ్యవసాయరంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లాలో రైతు సమస్యల పరిష్కారం, పంటలకు మద్దతు ధర, బోనస్ రూ.500 చెల్లించాలని కోరుతూ కలెక్టర్ పీ ప్రావీణ్యకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని ఒకసారి, నీళ్లు సరిపడా లేవని ఒకసారి ప్రకటనలు చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేయక పంటలు ఎండి రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. ప్రకృ తి వైపరీత్యాలతో గతంలో పంట నష్టం జరిగితే నాటి సీఎం కేసీఆర్ ఉగాది రోజు 103 డిగ్రీల జ్వ రం ఉన్నా వరంగల్కు వచ్చి రైతులను ఓదార్చారని గుర్తు చేశాడు.
రాజకీయాలకతీతంగా పంట నష్టం కింద ఎకరానికి రూ.10 వేల చొ ప్పున ఆర్థిక సాయం చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అవగాహన లేక, లౌక్యం లేక, బుద్ధి లేక తప్పుడు ప్రకటనలు చేసి రైతులను మోసం చేసిందన్నారు. ఫలితంగా రైతుల పంటలు ఎండిపోయి నష్టం జరిగిందని, ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ కాల్వ కింద డీబీఎం-38, 40, 48తో పాటు స్టేజీ-1, 2లో ఉన్న మొత్తం కాల్వల్లో 50శాతం కూడా సాగు నీరు ఇవ్వలేదన్నారు. డీబీఎం-38 కింద అతిపెద్ద కెనాల్ ఎస్సారెస్పీ మొత్తం 98 కిలోమీటర్లు ఉందన్నారు.
గీసుగొండ నుంచి భూపాలపల్లి చిట్యాల వరకు ఉన్న ఈ కెనాల్లో 925 క్యూసెక్ల నీటిని విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 470 క్యూసెక్ల నీరు కూడా దాటలేదన్నారు. గత నెల ఎల్ఎండీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా వరంగల్కు వచ్చే నీటిని బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారన్నారు. రాష్ట్ర పంట షెడ్యూల్కు, తూర్పు వరంగల్ షెడ్యూల్కు 45 రోజుల వ్యత్యాసం ఉందన్నారు. పంటలకు సాగు నీరు అవసరమన్నారు. మక్కజొన్న పంటలకు ఇంకా రెండు తడుల నీటి ని అందించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 8వ పేజీలో చాలా స్పష్టంగా మద్దతు ధరతో పాటు అ దనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఖరీఫ్కు ఇవ్వలేదని, దీంతో రైతులు రూ.146 కోట్లు నష్టపోయారన్నారు. కనీసం యాసంగి పంటలకైనా ఇవ్వాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రాకుండా కొంతమంది మిల్లర్లకు, దళారులకు విక్రయిస్తారన్నారు. వీరందరికి వ్యవసాయ శాఖ క్రాప్ బు కింగ్ ఆధారంగా రైతుబంధు ఏ విధంగా నేరుగా రైతుల అకౌంట్లలో పడుతుందో అదే విధంగా బోనస్ కూడా వేయాలన్నారు. సాగునీటితో పాటు కనీసం యాసంగి బోనస్ చెల్లించకుంటే ఈ నెల 6న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.