హనుమకొండ, మే 17 : ఎప్సెట్ ఫలితాల్లో రెజోనెన్స్ వరంగల్ కళాశాలలు సత్తా చాటాయి. జేఈఈ మెయిన్ అడ్వాన్స్, నీట్ జాతీయస్థాయి ఫలితాల్లోనే కాకుండా టీజీ ఎప్సెట్ -2026 ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు విద్యాసంస్థల చైర్మన్ లెకల రాజిరెడ్డి తెలిపారు. డీ స్మితిక 753 ర్యాంకు, సీహెచ్ భువనేశ్వరి 878, డీ సంజన్ 925, ఏ రితిక 982 ర్యాంకు సాధించినట్లు వివరించారు.
వీరితో పాటు 291 మంది విద్యార్థులు 10 వేల లోపు ర్యాంకులు సాధించగా వారి రాష్ట్రంలోని టాప్ 10 కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉందని తెపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెజోనెన్స్ డైరెక్టర్లు లెకల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏవో లెకల రమ్యా రాజిరెడ్డి, డీన్ బీఎస్ గోపాల్రావు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.