ఖిలావరంగల్/పోచమ్మమైదాన్, నవంబర్ 28: మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో ఎంతో మంది గొప్ప నాయకులుగా ఎదిగారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు పిలుపునిచ్చారు. ఫూలే వర్ధంతి సందర్భంగా వసంతాపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కే దామోదర్, ఎంఈవో విజయ్కుమార్, కాంప్లెక్స్ హెచ్ఎం శారదాబాయి, హెచ్ఎం ఎస్ విజయ, టీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శివనగర్లో ఫూలే వర్ధంతిని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ల్యాదల్ల శరత్ ఫూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాం సురేందర్, సందీప్, చందన్, మనోజ్ పాల్గొన్నారు. అలాగే, స్వర్ణభారతి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దేశాయిపేటలో ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితా రాజు యాదవ్ హాజరై ఫూలే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు పాలడుగుల నిర్మల, సామాజిక వేత్త డాక్టర్ పాలడుగుల సురేందర్, సేవ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఐత ఉషాభాస్కర్, స్వప్న, స్థానికులు శంకర్కుమార్, శరత్, భద్రమ్మ పాల్గొన్నారు.
ఫూలేకు నివాళి..
దుగ్గొండి/రాయపర్తి: కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, సత్యశోదక్ వ్యవస్థాపకుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 104వ వర్ధంతిని సోమవారం మండలవ్యాప్తంగా నిర్వహించారు. గిర్నిబావిలోని ఎంజేపీటీలో ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్, ఆదర్శవాణి ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ ఎన్ రవి, ఏబీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రత్యేకాధికారి దేవేందర్, బొట్ల నరేశ్ మాట్లాడుతూ మధ్య తరగతి, దిగువ కులాల తరగతుల వారు అన్నింటా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన వ్యక్తి ఫూలే అని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి ఆదర్శవంతంగా నిలువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏబీఎన్ఎస్ఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, రాయపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రాయపర్తి-2 ఎంపీటీసీ అయిత రాంచందర్ నేతృత్వంలో పలు సంఘాల ప్రతినిధులు ఫూలేకు నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు ముద్రబోయిన సుధాకర్, చందు రామ్యాదవ్, అయిత మల్లేశ్, వేల్పుల వెంకటసాయిలు, ఎల్లయ్య, సంపత్, సంతోష్కుమార్రెడ్డి, గాడిపల్లి యాకయ్య, కోట భిక్షపతి, గారె కుమారస్వామి, అయిత ఎల్లయ్య పాల్గొన్నారు.