హనుమకొండ రస్తా, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సినయర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కౌంస్యవిగ్రహాన్ని వరంగల్లో ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్రావు, గొర్రెల, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీజేపీ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్లో సంపూర్ణ మద్దతు సుష్మాస్వరాజ్ ప్రకటించారని, వారి విగ్రహాన్ని వరంగల్తో పాటు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ప్రతిష్టించి సముచితగౌరవాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విగ్రహం ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు తెలుపాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద ఐలయ్య, వంగాల సమ్మిరెడ్డి పాల్గొన్నారు.