స్టేషన్ఘన్పూర్, జూన్ 9: మాజీ ఎమ్మెల్యే రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్లగుట్టలో విద్యుత్ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న భట్టిని అడ్డుకోవాలని సోమవారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్టేషన్ఘన్పూర్లోని తన నివాసంలోనే తాటికొండతో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులను నిర్బంధించారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ భట్టి పర్యటనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన సబ్ స్టేషన్లను ఇప్పుడు ప్రారంభిస్తూ, తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేయ డం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ తాటికొండ మధు, మండల మాజీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, కనకం గణేశ్, గాదె రాజు, మారపల్ల ప్రసాద్, గుండె మల్లేశ్, ఆకారపు అశోక్ హౌస్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.