కాశీబుగ్గ, జనవరి 6: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు ఎదుట ఉన్న రైతు విగ్రహం వద్ద గురువారం రైతుబంధు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతులు, అధికారులు వ్యవసాయ ఉత్పత్తులతో రైతుబంధు వారోత్సవాలు, జై కేసీఆర్ అని రాశారు. అలాగే, రైతు విగ్రహాన్ని పూలతో అలంకరించారు. రాష్ట్రంలో రైతుబంధు సాయం రూ. 50 వేల కోట్లకు చేరుకోవడంపై రైతులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో డీఎంవో పాలకుర్తి ప్రసాద్రావు, జేడీఏ ఉషాదయాళ్, మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేశ్రాహుల్, గ్రేడ్-2 కార్యదర్శులు తోట చందర్రావు, బియాబాని, అసిస్టెంట్ సెక్రటరీలు జన్ను భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి, ఆరపల్లి, కొత్తపెటలో కార్పొరేటర్ జన్ను షీబారాణి-అనిల్ ఆధ్వర్యంలో రైతుబంధు ఉత్సవాలు నిర్వహించారు. జడ్పీఎస్ఎస్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఈట్యాల హరికృష్ణ, హెచ్ఎం జలజ, నాయకులు మంతుర్తి కుమార్, మూర్తి, విజయ్, రంజిత్, వ్యవసాయాధికారి కిరణ్ పాల్గొన్నారు.
‘రైతుబంధు’ను భావితరాలకు తెలియజేయాలి
రాయపర్తి: సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం ప్రయోజనాలను భావితరాలకు తెలియజేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధన్నపేట నేతృత్వంలో మండలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాయపర్తి జడ్పీఎస్ఎస్లో లయన్స్ గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి అధ్యక్షతన రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ఉత్తమ వ్యాసాలు రాసిన విద్యార్థులకు ఈ నెల 10న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బహుమతులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్, తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ, ఏవో గుమ్మడి వీరభద్రం, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు రాంచందర్, రాధికాసుభాష్రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సుదర్శన్రెడ్డి, సుభాశ్రెడ్డి, మండల నోడలాఫీసర్ కృష్ణమూర్తి, హెచ్ఎం భాస్కర్రావు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: నర్సంపేట మండలంలోని మహేశ్వరం, పర్శనాయక్తండా, కమ్మపల్లి, దాసరిపల్లి, చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లిలో రైతుబంధు సంబురాలు ఉత్సాహంగా జరిగాయి. టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పార్టీ శ్రేణులు, రైతులు ఎడ్ల బండ్లపై భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్లు గాంధీ, రంగారెడ్డి, లావణ్య, యువరాజ్, ఎంపీటీసీలు విజయ, వీరన్న, శ్రీనివాస్రెడ్డి, పద్మనాభరెడ్డి, గోపాల్రెడ్డి, కరుణాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, రాజపల్లి, గురిజాల జడ్పీఎస్ఎస్ల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. సర్పంచ్లు భాగ్యమ్మ, మమత, ఆర్బీఎస్ గ్రామ కో ఆర్డినేటర్ కోమల, రాజమల్లు, హెచ్ఎం రాంచందర్రావు, ఏఈవో సింధు పాల్గొన్నారు.
వర్ధన్నపేట: మండలంలోని చెన్నారంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, సర్పంచ్ పునుగోటి భాస్కర్రావు, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, ఉపసర్పంచ్ రాజమౌళి, ఏడీఏ సురేష్కుమార్, ఏవో రాంనర్సయ్య హాజరై విజేతలకు బహుమతులు అందించారు. కోనాపురంలో కౌన్సిలర్ పాలకుర్తి సుజాత, మాజీ జడ్పీటీసీ సారంగపాణి ఆధ్వర్యంలో పత్తి చేనులో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
పర్వతగిరి: కొంకపాకలో సర్పంచ్ వర్కాల రమేశ్, ఎంపీటీసీ గర్మిళ్ల మోహన్రావు, మాజీ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో వరి పొలాల వద్ద రైతు కూలీలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కరీమాబాద్: వరంగల్ 43వ డివిజన్ పరిధిలోని నక్కలపల్లిలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో కార్పొరేటర్ అరుణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పంటల సాగు పెరిగిందని ఆమె అన్నారు.
నెక్కొండ: మండలంలోని పనికర, సూరిపల్లి, చిన్నకోర్పోలులో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, నాయకులు మోహన్రెడ్డి, నరేందర్రెడ్డి, ధనుంజయ, శ్రీహరి, కుమారస్వామి, ఎంపీటీసీ అజయ్, రమేశ్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: చెన్నారావుపేట, జల్లి, ఉప్పరపల్లి హైస్కూళ్లలో ఏఈవోలు స్మిత, వినయ్, రఘుపతి, సంపత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు రవి, ఫ్లోరెన్స్, సరళ, ఉపాధ్యాయులు ఉమారాణి, నాగేశ్వరాచారి, జగన్నాథం, శ్రీలత, రాంబాబు, సరిత పాల్గొన్నారు.
ఖానాపురం: బుధరావుపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, పార్టీ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, ఎంపీటీసీ సుభాన్బీ, మౌలానా, మైనార్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ సర్వర్, కృష్ణారెడ్డి, నాగరాజు, రాజశేఖర్, అల్లావొద్దీన్, బాలు, రాంనర్సింహారెడ్డి పాల్గొన్నారు.
దుగ్గొండి: మండలంలోని మల్లంపల్లి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులు వేసి సంబురాలు నిర్వహించారు. రేఖంపల్లి, మర్రిపల్లి, తిమ్మంపేట, బొబ్బరోనిపల్లిలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: కన్నారావుపేటలోని రైతు వేదికలో సర్పంచ్ తంగెల్ల నిర్మలా రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు కోడెం బుచ్చయ్య, ఇట్టె కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మామిడిశెట్టి రవి, నాయకులు పులిగుజ్జుల బాలరాజు, టీ సంపత్, టీ రాజు, కొండ రమేశ్, కక్కెర్ల సాంబయ్య పాల్గొన్నారు.
ఖిలావరంగల్: గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లోని బొల్లికుంట, స్తంభంపల్లిలో రైతుబంధు పథకంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత, ఆర్బీఎస్ స్తంభంపల్లి గ్రామ కన్వీనర్ పోచన స్వామి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బొజ్జం సుధాకర్, సాగర్రెడ్డి పాల్గొన్నారు.