ప్రధాని పదవి చేపట్టిన ఒకే ఒక్క తెలుగువాడు
ఆయనకు భారత రత్న ఇవ్వాల్సిందే..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పీవీకి ఘన నివాళి
హనుమకొండ చౌరస్తా, జూన్ 28: మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంస్కరణలు తెస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పీవీ జయంతి సందర్భంగా మంగళవారం హనుమకొండ బస్స్టేషన్ జంక్షన్ వద్ద పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రధాని పదవి చేపట్టిన ఒకే ఒక్క తెలుగువాడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అన్నారు. తన తండ్రి పీవీ శిష్యుడని, ఆయన వద్దకు తనను తీసుకెళ్లేవారని మంత్రి చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని, చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఆయన పుట్టిన పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
పీవీ సేవలు మరవలేనివి : దాస్యం
పీవీ నర్సింహారావు చేసిన సేవలు మరవలేనివని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా బస్టాండ్ జంక్షన్లోని పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంసరణలతో దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని కొనియాడారు. పీవీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ముందుకుసాగుతున్నారన్నారు.
ఆర్థిక సంస్కరణల ఘనత పీవీదే : ఎమ్మెల్యే వొడితెల
భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంసరణలు తీసుకువచ్చిన ఘనత పీవీ నరసింహారావుదేనని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ శతజయంతి వేడుకలను నిర్వహించిందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, మేయర్ గుండు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ పాల్గొన్నారు.
వంగర గ్రామంలో..
భీమదేవరపల్లి : మండలంలోని వంగర గ్రామంలో పీవీ విగ్రహానికి ఎమ్మెల్యే సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మ్యూజియంగా మార్చిన పీవీ ఇంటిని సందర్శించారు. ఎంపీపీ జక్కుల అనితా రమేశ్, జడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ ఆలూరి రజిత, ఎంపీటీసీ నల్ల కౌసల్య, తహసీల్దార్ పోలం ఉమారాణి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో నాగరాజు, కార్యక్రమ కోఆర్డినేటర్ పీవీ మదన్మోహన్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్పాటి మహేందర్రెడ్డి, మాక లాజరస్, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ఎస్సైలు మౌనిక, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
ములుకనూరులో..
ములుకనూరులోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో పీవీ విగ్రహానికి జడ్పీటీసీ వంగ రవితోపాటు పీవీ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పం చ్ మాడుగుల కొంరయ్య, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేశ్, అప్పని పద్మ, ఎస్ఆర్టీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎదులాపురం మొగిలి, అశోక్ముఖర్జీ, నవాబ్షా, మార్పాటి మహేందర్రెడ్డి, అప్పని భిక్షపతి, కొల్గూరి రాజు, ఎదులాపురం తిరుపతి, అధ్యాపకులు హరికృష్ణ, రాంబాబు, సుమన్, లింగారెడ్డి, గణేశ్, జ్యోతి పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో..
హనుమకొండ సిటీ : నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి సీఎండీ గోపాల్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, పీ గణపతి, సంధ్యారాణి, మోహన్రెడ్డి, తిరుపతిరెడ్డి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీలో..
నయీంనగర్ : కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనంలో పీవీ చిత్రపటానికి రిజిస్ట్రార్ వెంకట్రామ్రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో భోధనా, బోధనేతర, పరిశోధకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
ఆర్ట్స్ కళాశాలలో..
హనుమకొండ : సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హన్మంతు, సహాయ రిజిస్ట్రార్ కిష్టయ్య పాల్గొన్నారు.
పరకాలలో..
పరకాల : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను ఆధ్వర్యంలో పీవీ జయంతిని నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, శనిగరపు నవీన్, మార్క రఘుపతి, నక్క చిరంజీవి, మొలుగూరి భిక్షపతి, ఘంటా కళావతి, ఎండీ బియాబాని, ఏకు రమేశ్, బండి వెంకటేశ్ పాల్గొన్నారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో..
హనుమకొండ చౌరస్తా : హనుమకొండలోని బ్రాహ్మ ణ సంఘం కార్యాలయంలో పీవీ చిత్రపటానికి బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు పరాశరం రవీంద్రాచారి, కృష్ణమాచారి, అగ్నిహోత్రం చంద్రశేఖర్శర్మ, రామ్మోహన్రావు, చక్రధర్, ఆచార్యులు నరసింహాచార్యులు నివాళులర్పించారు. అలాగే, గ్రేటర్ 5వ డివిజన్ హనుమాన్నగర్లో టీఆర్ఎస్ నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముత్తినేని రమేశ్, మొట్ల మనోహర్, సాదుల రఘుపతి, కుమార్రెడ్డి, శ్రీనివాస్, రాజ్కుమార్, వెంకటేశ్, మల్లేశం, వేణు పాల్గొన్నారు.