నెక్కొండ, జూలై 25 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పత్తిపాకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 కుటుంబాలు, నెక్కొండలో 30 కుటుంబాలకు చెందిన వారు పెద్ది సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కుట్రలను తట్టుకుంటూ రైతులకు ఉచిత కరంట్, పెన్షన్, రైతు బంధు, రైతుబీమా తదితర పథకాలను అమ లు చేయడం సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యమయ్యాయన్నారు. స్వయం పాలన కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పాలించే అర్హత జాతీయ పార్టీలకు లేదన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ కోరితే కేంద్రం కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు.
తెలంగాణకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు క్యూ కడుతుంటే కేంద్రం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట సమగ్ర అభివృద్ధి కోసం విజన్తో ముందుకు సాగుతున్నామన్నారు. పాకాల-రంగాయ చెరువు ప్రాజెక్టు, గోదాముల నిర్మాణం, ఇరిగేషన్ సర్క్యూట్పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజ-హరికిషన్నాయక్, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, బొల్లెబోయిన వీరస్వామి, సూరం రాజిరెడ్డి, గుంటుక సోమయ్య, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, దీక్షకుంట, బంజరుపల్లి సర్పంచ్లు ఆలకుంట సురేందర్, బదావత్ స్వరూప-రవి పాల్గొన్నారు.