బయ్యారం, అక్టోబర్3: బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఉరివేసిందా..? అనే సందే హాలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఏ ర్పాటు సమయంలో ఆర్టికల్ 13లో రూ. 30 వేల కోట్ల తో సెయిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ పరిశ్రమ నిర్మిం చేలా బిల్లులో పొందుపరిచారు. అయినా కేంద్ర ప్ర భుత్వం తొమ్మిదేండ్లు గడిచినప్పటికీ ఉక్కు పరిశ్రమ వి షయంలో స్పష్టత ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత ప్రధాన మంత్రి మోదీ అనేక సార్లు రా ష్ట్రంలో పర్యటించారు. ఒక్కసారి కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీ అంశంపై నోరు మెదపలేదు. మూడు రోజుల క్రితం మహబూబ్నగర్ పర్యటనకు వ చ్చిన ప్రధాని మోదీ రాష్ట్రంలోని అనేక అంశాల గురించి ప్రస్తావించినప్పటికీ స్టీల్ ప్లాంట్ అంశాన్ని మాత్రం ప్రస్తా వించలేదు. అదేవిధంగా మంగళవారం నిజామాబాద్ ప ర్యటనకు వచ్చిన ప్రధాని బయ్యారం అంశాన్ని ప్రస్తావి స్తారని తెలంగాణ ప్రజానీకం అశగా ఎదురుచూసినా నిరాశే మిగిలింది. తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా నిలువనున్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదిక ద్వారా ప్రధానమంత్రికి ప్రశ్నలు సంధించారు.
‘మా కాజీపేట కోచ్ఫ్యాక్టరీకి ప్రాణం పోసెదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాల మూరు ప్రాజెక్ట్కు జాతీయ హోదా దక్కేదెప్పుడు? అని సూటిగా ప్రధానిని ప్రశ్నించారు. అంతేకాకుండా పదేండ్ల నుంచి పాతరేసి ఎంతకాలం అబద్ధాల జాతర? అని మండిపడ్డారు. ‘మోదీ మీ మనసు కరిగేదెప్పుడు? తెలం గాణ గోస తీరెదెప్పుడు? గుండెల్లో గుజరాత్ పెట్టుకొని తెలంగాణ గుండెల్లో గునపాలా?, కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఊపిరి తీశారు?, లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీ ఐఆర్ని ఆగం చేశారు?, తెలంగాణ ప్రాజెక్ట్లకు జాతీయ హాదా హామీని తుంగలో తొక్కారు? అంటూ తీవ్ర స్థా యిలో మండిపడ్డారు. అయితే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంది. అనేక సార్లు కేంద్రానికి మొర పెట్టకున్నా కనికరించలేదు. ప్రధాని నిజామాబాద్ పర్యటన వేళ మరో మారు బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశం తీవ్ర చర్చనీయంగా మారింది.
ఖనిజం లేని చోట ఉక్కు ఫ్యాక్టరీ
కేంద్రప్రభుత్వం ఇనుప ఖనిజం ఉన్న చోట ఫ్యాక్టరీ నిర్మించకుండా అది లేని చోట ఫ్యాక్టరీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తూ తెలంగాణ పట్ల వివక్షను చూపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో 1,41,691 ఎకరా ల్లో(5690 హెక్టార్ల) ఇనుప ఖనిజం ఉండగా మానుకోట జిల్లాలోని బయ్యారం, గార్ల, గూడూరు మండలాల్లో సుమారు 44 వేల హెక్టర్లలో ఇనుప ఖనిజం ఉంది. కాగా బయ్యారం మండలంలోని ఇర్సులాపురం, రామచంద్రాపురం, మొట్లతిమ్మపురం, చింతోని గుంపు అటవీ ప్రాంతంలోని 25, 700 హెక్టర్లలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉందని గతంలో అనేక సర్వే సంస్థల అధికారులు తేల్చారు.
80 శాతం ఇనుప ఖనిజం బయ్యారం పరిసర ప్రాంతాల్లో ఉండగా, ఇక్కడ 60 నుంచి 70 శాతం నాణ్యత కలిగి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో నాణ్యత కలిగిన ఉక్కు లేదని ఆసత్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైలడిల్లా గనులను బయ్యారానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం పట్టిం చుకోకుండా, గనులు లేని ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్కు తరలించేందుకు పూనుకుంది. అంతే కాకుం డా ప్రధానికి అత్యంత ఆప్తుడైన ఆదానీకి బైలడిల్లా గను లు కేటాయించి అక్కడే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇనుప ఖని జం ఉన్న బైలడిల్లా ప్రాంతం బయ్యారానికి 180 కిలో మీటర్లు మాత్రమే. కానీ కేంద్రప్రభుత్వం 1800 కిలో మీటర్ల దూరంలోని గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రాకు తరలించేందుకు సన్నాహాలు చేస్తూ బయ్యారాన్ని బలి చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.