హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 4 : కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘల జేఏసీ కో-చైర్మన్ పి.రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈనెల 15,16 తేదీలలో జరిగే హలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్లు రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిర రాజు గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని ప్రధాన డిమాండ్తో బీసీ జేఏసీ ఆందోళన కార్యక్రమాలలోభాగంగా బీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ నెల 15,16 తేదీలో నిర్వహించే తలపెట్టిన పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ చెన్నం మల్లయ్య, కేయూ బీసీ జేఏసీ కో-ఆర్డినేటర్ మామిడిశెట్టి నాగరాజు, బీసీ విద్యార్థుల వేదిక జిల్లా కన్వీనర్ బాబుయాదవ్, బీసీ జేఏసీ యువజన రాష్ట్ర నాయకుడు చిర్ర సుమన్, కేయూ బీసీ విద్యార్థి సంఘాల వైస్ చైర్మన్ ఆనంద్ నేత, కేయూ బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు నరేష్ యాదవ్, ప్రమోద్ పాల్గొన్నారు.