వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గురువారం జరిగిన పోలింగ్లో ప్రముఖులు పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి,బస్వరాజు సారయ్య తదితరులు ఉన్నారు.