భీమదేవరపల్లి, జనవరి 11: కొత్తకొండ జాతరలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జోన్ డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించి ఆల య ప్రదక్షిణలు చేశారు. అర్చకుడు ఆయనకు శేషవస్త్రంతోపాటు మెమెంటోను అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాలను కలియదిరిగి జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రహదారులు, పార్కింగ్ స్థలాలు, క్యూలైన్, బారికేడ్లు, దుకాణ సముదాయాలను పరిశీలించి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. జూదం, మట్కావంటి ఆటలు ఆడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మఫ్టీలో పోలీసులు గస్తీ నిర్వహిస్తారని, అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సర్పంచ్ దూడల ప్రమీల, యాటపోలు రాజమణి, ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో కిషన్రావు, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ముల్కనూరు, వంగర ఎస్సైలు ప్రవీణ్కుమార్, మౌనిక, ఆలయ సిబ్బంది సంజీవరావు, సందీప్, శ్రీధర్, రాజు, డైరెక్టర్లు ఎల్తూరి ప్రభాకర్, భూక్య తులస్య, మఠం శ్రీశైలం పాల్గొన్నారు.