ములుగు, జూన్ 2(నమస్తేతెలంగాణ) : పేలుడు పదార్థాలతో పాటు ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలను వెల్లడించారు. మావోయిస్టు పార్టీతో సంబంధం కలిగిన వ్యక్తులు వెంకటాపురం(నూగూరు) మండలం చెలిమలలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పేరూరు ఎస్సై సిబ్బందితో అక్కడికి వెళ్లారు.
పోలీసులను చూసిన మావోయిస్టు కొరియర్లు తప్పించుకునే ప్రయత్నించగా, వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసూరు బ్లాక్కు చెందిన మడిని దేవ దేవయ్య, కిక్కిడి హు అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకం ఉన్నారు. వీరిద్దరు పోలీస్లను హతమార్చాలనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను అమర్చారన్నారు. వీరి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఓఎస్డీ అశోక్కుమార్, సీపీఎస్ సీఐ శివప్రసాద్, వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు, పేరూరు హరీశ్ పాల్గొన్నారు.