సుబేదారి, సెప్టెంబర్ 28 : మైనర్ బాలుడు సహా ముగ్గురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో సెంట్రల్ డీసీపీ అబ్దుల్ బారి వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ర్టానికి చెందిన యోగేంద్ర రామ్, వేదవతీదేవి కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరు సులువుగా డబ్బు సంపాందించాలనే ఆశతో బీహర్కు చెందిన గంజాయి రవాణాదారుడు అఖిలేప్తోను పరిచయం చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి ఒడిషా చెందిన బాలుడితో కలిసి బరంపురం గ్రామ పరిసరాల్లో గంజాయి కొనుగోలు చేసి, హైదరాబాద్కు చెందిన అరవింద్కు విక్రయించేవారు. ఈ ముఠా 24కిలోల గంజాయిని హైదరాబాద్కు రైల్లో తరలిస్తుండగా, ఇంతేజార్గంజ్ పోలీసులకు వరంగల్ రైల్వే స్టేషన్లో పట్టుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ముఠాను పట్టుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్సై కొమురెల్లి, సిబ్బందిని డీసీపీ అభినందించారు.
హసన్పర్తి : అక్రమంగా తరలిస్తున్న 37 కేజీల గంజాయిని హసన్పర్తి పోలీసులు పట్టుకున్నారు. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. హసన్పర్తి పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందం బుధవారం సాయంత్రం అంబాల క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి కారు వేగం పెంచిన వ్యక్తిని పట్టుకుని విచారించారు. కారులో తనిఖీ చేయగా, 37 కేజీల గంజాయిని గుర్తించారు. కారును సీజ్ చేసి నిందితుడు నేరెళ్ల సతీశ్పై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఎల్లాపూర్ శివారులో పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ముఠా నుంచి తప్పించుకున్న ప్రధాన నిందితుడు నేరెళ్ల సతీశ్ అని గుర్తించారు.