నర్సంపేట, జనవరి 4: పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో బుధవారం దాడులు చేసి నర్సంపేటకు చెందిన వేములూరి భానుప్రసాద్, మహ్మద్ రహ్మత్ను పట్టుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి 100 గ్రాముల గంజాయిని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. మరో వ్యక్తి జగదీశ్ అలియాస్ వీరూ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరు వారం రోజుల నుంచి దాసరిపల్లెలోని రాజాలు వద్ద గంజాయి కొని తాగుతున్నట్లు విచారణలో తేలిందన్నారు.