మరిపెడ, జనవరి 27: మరిపెడతోపాటు పలు గ్రామాల్లో చోరీల కు పాల్పడుతున్న అంత ర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన పోలసాని శివకుమార్ చోరీలకు పాల్పడుతుండడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
అతడి వద్ద రూ.6100 నగదుతో పాటు పల్సర్ వాహనం, పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ర్టాల్లోని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, గుంటూరు, నాగర్ కర్నూ ల్, నిజామాబాద్, అనంతరపురం, కడప, చిత్తూ రు, కర్నూల్ జిల్లాల్లో శివకుమార్ చోరీలకు పాల్పడి పలుమార్లు జైలు జీవితం అనుభవించినట్లు డీఎస్పీ రఘు వెల్లడించారు. వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలో పల్సర్ బైక్ను, సీరోలు మండలం కిరాణం దుకాణంలో చోరీ చేశాడు. మరిపెడలోని సెల్పాయింట్లో నగదు, సెల్ ఫోన్లు అపహరించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు శివకుమార్ చిక్కాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ ఎన్ సాగర్, ఎస్సై పవన్ను ఆయన అభినందించారు.