నల్లబెల్లి, నవంబర్ 11 : త్వరలో పోడు రైతుల కల సాకారం కానుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆసరవెల్లి, కొండాపూర్ గ్రామాల్లో జరుగుతున్న పోడు భూముల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పోడు చేసుకుని జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర నిరుపేదల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2005 కు ముందు కాస్తులో ఉన్న ప్రతి రైతు భూమినీ సర్వే చేసి పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో 22 వేల పైచిలుకు ఎకరాలకు సంబంధించిన 7,450 మంది రైతులు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. మండలంలో ఇప్పటికే 60 శాతం సర్వే పూర్తయిందన్నారు. మరికొందరు వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేదని, రెండో విడుత సర్వేలో వీరి సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. అధికారులు గడువులోగా సర్వే పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్కుమార్, సీఐ సూర్యప్రకాశ్, ఎంపీవో కూచన ప్రకాశ్, ఆర్ఐ రాజేంద్రప్రసాద్, సర్పంచ్లు రవి, చింతపట్ల సురేశ్, మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, నాయకులు గందె శ్రీనివాస్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం చేసేందుకే..
ఖానాపురం : పోడు రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ భూముల సర్వే నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండంలలోని అశోక్నగర్, చిలుకమ్మతండా, దబీర్పేట గ్రామాల్లో చేపడుతున్న పోడు సర్వేను ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 20 టీమ్లు సర్వే నిర్వహిస్తున్నాయని, ఒక్కో టీం రోజుకు 20 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మరో వారం రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉండని, అవగాహన లేక దరఖాస్తు చేసుకోని రైతులు నియోజకవర్గంలో 500 మంది ఉన్నారని, వారికి మరో అవకాశం కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. దరఖాస్తుల గడువు పెంపు అంశం సీఎం పరిధిలో ఉన్నందున కేబినెట్ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నూతనంగా పోడు చేసే వారిపై పీడీ యాక్టులు వోఓ జహీరొద్దీన్, ఎంపీడీవో సుమనావాణి, డీఆర్వో మోహన్, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, సర్పంచ్లు వెంకన్న, రాజు, కవిత, బొప్పిడి పూర్ణచందర్రావు, నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు బానోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.