సుబేదారి, జనవరి 3 : పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల ఉద్యోగ నియామకాలకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా ముగిశౠయి. వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలోని మైదానంలో గత నెల 8వ తేదీన ప్రారంభమైన పరీక్షలు మంగళవారం ముగిశాయి. పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి ఫిజికల్ ఈవెంట్స్ను సక్సెస్ చేశారు. అభ్యర్థులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. దేహదారుఢ్య పరీక్షలు 22 రోజులపాటు సాఫిగా జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసు అధికారులు సీసీ కెమెరాల నిఘాలో అధునాతమైన టెక్నాలజీతో పక్బందీగా పారదర్శకంగా నిర్వహించారు. అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ చేస్తున్న క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టెక్నికల్ సమస్య తలెత్తకుండా, ఏ రోజుకు ఆరోజు ఈవెంట్స్ సాఫీగా జరగానికి పోలీసు క మిషనర్ రంగనాథ్ రోజువారీగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. దేహదారుఢ్య పరీక్షల నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన పోలీసు అధికారులు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేశ్, ఏవో రామకృష్ణ, ఏసీపీలు, ఆర్ఐలు, సిబ్బందిని సీపీ రంగనాథ్ అభినందించారు.
అర్హత సాధించిన 12,387 మంది ఫురుషులు
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మొత్తం 24, 612మంది పురుష అభ్యర్థులకుగాను 21,585 మంది (88శాతం) దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 12,387 మంది (57శాతం) ప్రతిభ చాటి , తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. మరోవైపు మహిళా అభ్యర్థులు 4,784 మందికిగాను వీరిలో 4.458 మంది ఫిజికల్ ఈవెంట్స్కు హాజరయ్యారు. వీరిలో 3,283 మంది ప్రతిభ చాటి తుది రాత పరీక్షకు అర్హత సాధిం చారని అధికారులు తెలిపారు.