హనుమకొండ చౌరస్తా : వరంగల్ డిస్ట్రిక్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూడీటీఏ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూడీటీఏ-2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్స్ ( Tennis tourney ) ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రెండురోజుల పోటీలను శనివారం హనుమకొండలోని ఆఫీసర్స్ క్లబ్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ( MLA Nayini Rajendar Reddy ) పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి జీవనశైలిలో శారీరక వ్యాయామం ఎంతో ముఖ్యమన్నారు. నిరంతర క్రీడలు యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. డబ్ల్యూడీటీఏ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరెడ్డి ( Gandra Satyanarayana Reddy ) మాట్లాడుతూ క్రీడలు జీవితంలో అవిభాజ్యభాగంగా ఉండాలని, ప్రాథమిక విద్య నుంచి గ్రాడ్యుయేషన్ వరకు క్రీడలను తప్పనిసరి చేయాలని సూచించారు.
ఈ టోర్నమెంట్లో మొత్తం 90 జట్లు పాల్గొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏసీపీ నరసింహరావు, మురుగన్, కన్నారెడ్డి, టి.బాబురెడ్డి, కమల్, డాక్టర్ జయసింహరెడ్డి, రవీంద్రనాథ్, ప్రభాకర్రావు, వీఎస్ రెడ్డి, జి.రవీందర్, దుర్గాప్రసాద్, శరత్, డాక్టర్ ప్రవీణ్ (డెంటల్), తెలుగు రామకృష్ణ పాల్గొన్నారు.