హనుమకొండ చౌరస్తా, జనవరి 9 : మహాలక్ష్మీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్తో ఓవర్లోడ్ అయి క్లచ్ప్లేట్లు, కట్టలు విరగడం, టైర్లు పగులుతున్నందున భయంతో డ్రైవింగ్ చేయాల్సి వస్తున్నదని చెప్పారు. ఈమేరకు తమ సమస్యలు పరిష్కరించాలని అద్దె బస్సు ఓనర్ల యూనియన్ రీజినల్ అధ్యక్షుడు మారిపెల్లి రామిరెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
బస్సు స్టేజీ మీదకు రాకముందే సీట్ల కోసం ఎగబడుతుండడం వల్ల సైడ్గ్లాస్లు బ్రేక్ అవుతున్నాయని, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉందని, కేఎంపీఎల్ రాక ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఫుట్బోర్డు ప్రయాణం వద్దని చెబితే డ్రైవర్లపైనే దాడి చేస్తున్నారని, ప్రతి గ్రామానికి 5, 6 స్టేజీల్లో ఆపడం, ఎక్కడం వల్ల పని భారం పెరుగుతున్నందున డ్రైవర్ల జీతాన్ని 15 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర హరి, పాడపల్లి శివ, రాజు ఉన్నారు.