ఓ వైపు పొగమంచు.. మరోవైపు ఎముకలు కొరికే చలితో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలైనా వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించారు. ఈ దృశ్యాలు మంగపేట మండలం కమలాపురం, మంగపేట, బోరునర్సాపురం గ్రామాల్లో కనిపించాయి. మరోవైపు సూర్యుడు సైతం చందమామలా తెల్లగా కనిపిస్తూ చూపరులను కనువిందు చేశాడు.